tamota: మోదీ ప్ర‌తిరోజు తైవాన్‌ నుంచి తెప్పించే పుట్టగొడుగులు తింటారు!: గుజ‌రాత్ కాంగ్రెస్‌ నేత వ్యాఖ్య‌లు

  • గుజ‌రాత్ ఎన్నిక‌ల నేపథ్యంలో మోదీపై విరుచుకుప‌డ్డ అల్పేశ్‌ ఠాకూర్‌
  • మోదీ ప్ర‌తిరోజు తైవాన్‌ నుంచి తెప్పించే పుట్టగొడుగులు తింటారు
  • అవి ఒక్కోటి 80 వేల రూపాయ‌లు
  • రోజుకి మోదీ భోజ‌న ఖ‌ర్చు 4 ల‌క్ష‌ల రూపాయ‌లు

గుజ‌రాత్‌లో మొద‌టి ద‌శ‌ అసెంబ్లీ ఎన్నిక‌లు ముగిసిన విష‌యం తెలిసిందే. రెండో ద‌శ ఎన్నిక‌లు ఎల్లుండి జ‌ర‌గ‌నున్నాయి. ఈ రోజుతో రెండో ద‌శ ఎన్నిక‌ల ప్ర‌చార గ‌డువు ముగిసింది. ఈ ఎన్నిక‌ల ప్ర‌చారంలో నేత‌లు ప్ర‌త్య‌ర్థుల‌పై ఎన్న‌డూ లేనంత‌గా వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశారు. గుజ‌రాత్ కాంగ్రెస్ నేత  అల్పేశ్‌ ఠాకూర్ ఈ రోజు ఎన్నిక‌ల ప్ర‌చారంలో మాట్లాడుతూ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీపై తీవ్ర వ్యాఖ్య‌లు చేశారు.

మోదీ ప్ర‌తిరోజు తైవాన్‌ నుంచి తెప్పించే పుట్టగొడుగులు తింటార‌ని ఆయ‌న‌ ఆరోపించారు. అవి ఒక్కోటి రూ.80 వేలు ఉంటాయ‌ని, మోదీ రోజుకు ఐదు తింటారని చెప్పారు. ఒక్క రోజు భోజనానికి ఆయ‌న రూ.4 లక్షలవుతుంద‌ని అన్నారు. ఒకప్పుడు మోదీ త‌న‌లాగే న‌ల్లగా ఉండేవారని కానీ ఇప్పుడు మంచి టమోటా పండులా తయారయ్యారని అల్పేశ్ అన్నారు.

More Telugu News