వైఎస్ జగన్: నా కోసం అక్కంపల్లి గ్రామస్తులు ఆత్రుతగా ఎదురుచూశారు!: వైఎస్ జగన్

  • 33వ రోజుకు చేరిన ప్రజా సంకల్పయాత్ర
  • ప్రతి ఒక్కరూ ఆత్రుతగా ఎదురు చూశారు 
  • ఫేస్ బుక్ లో జగన్ పోస్ట్ 

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిర్వహిస్తున్న ప్రజా సంకల్పయాత్ర 33వ రోజుకు చేరుకుంది. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని చిన్నంపల్లి క్రాస్ రోడ్ నుంచి జగన్ తన పాదయాత్ర ప్రారంభించారు. కూరుకుంట బీసీ కాలనీ, సజ్జల కాల్వ క్రాస్ రోడ్డు మీదుగా కూరుకుంట ఎస్సీ కాలనీ, వైఎస్సార్ కాలనీ, అక్కంపల్లి క్రాస్ రోడ్ మీదుగా ఆయన పాదయాత్ర కొనసాగుతోంది.

జగన్ ని చూసేందుకు అక్కంపల్లి గ్రామస్తులు ఆత్రుతగా ఎదురుచూశారు. ఈ విషయాన్ని జగన్ తన ఫేస్ బుక్ ఖాతాలో ప్రస్తావించారు. ‘నేను వారి గ్రామానికి రాబోతున్నానని తెలిసి, అక్కంపల్లి గ్రామస్తులు.. చిన్నారుల నుంచి అవ్వాతాతల వరకు ప్రతి ఒక్కరు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. వారి ముఖాల్లోని ఆనందం, ఉత్సాహం నాపై వారికున్న అభిమానాన్ని, నమ్మకాన్ని తెలుపుతోంది. ప్రతి ఒక్కరి సమస్యలను వింటాను, అన్ని వర్గాలవారి ఆవేదనను తెలుసుకుంటాను’ అని తన పోస్ట్ లో పేర్కొన్న జగన్, ఇందుకు సంబంధించిన ఫొటోలను జతపరిచారు.

More Telugu News