nani: 'మిడిల్ క్లాస్ అబ్బాయి' విషయంలో దిల్ రాజు కొత్త ఆలోచన!

  • విడుదలకి దగ్గరలో 'మిడిల్ క్లాస్ అబ్బాయి'
  • ప్రాజెక్టుపై క్రేజ్ పెంచాలనుకుంటోన్న దిల్ రాజు 
  • ఈ పని మీదనే దేవిశ్రీ ప్రసాద్ తో చర్చలు       

దిల్ రాజు నిర్మించిన 'మిడిల్ క్లాస్ అబ్బాయి' సినిమా ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ సినిమాలో నాని - సాయిపల్లవి జంటగా నటించారు. ఈ ఇద్దరికీ మంచి క్రేజ్ వుంది .. అయినా ఆశించిన స్థాయిలో బజ్ రాలేదు. ఆడియోకి కూడా పెద్దగా రెస్పాన్స్ రాకపోవడం ఈ సినిమా టీమ్ ను మరింత నిరుత్సాహ పరుస్తోందట.

 ఈ నేపథ్యంలో దేవిశ్రీ ప్రసాద్ ను కలిసిన దిల్ రాజు .. ఏదైనా ఒక సాంగ్ ను మరో సాంగ్ తో రీ ప్లేస్ చేస్తే బాగుంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టుగా సమాచారం. ఆ సాంగ్ జనానికి వెంటనే ఎక్కేసేలా ఉండాలని అన్నాడట. విడుదల తేదీ దగ్గరలోనే ఉండటం వలన సాధ్యాసాధ్యాల గురించి మాట్లాడినట్టుగా చెప్పుకుంటున్నారు. ఆ మరుసటి రోజునే అఖిల్ సినిమా ఉండటం .. ఈ సినిమా ఆడియోకి మంచి బజ్ రావడమే దిల్ రాజు ఈ నిర్ణయానికి రావడానికి కారణమని తెలుస్తోంది. నాని .. సాయిపల్లవిలకు గల క్రేజ్ ఈ సినిమాను ఏ స్థాయిలో నిలబెడుతుందో చూడాలి మరి.       

More Telugu News