paradise biryani: విజయవాడలో ప్యారడైజ్ హైదరాబాదీ బిర్యానీ!

  • బెజవాడవాసులకు అందుబాటులో ప్యారడైజ్ బిర్యానీ
  • బెంజ్ సర్కిల్ వద్ద తొలి ఔట్ లెట్
  • అన్ని వర్గాలకు చేరువయ్యేలా మెనూ

హైదరాబాద్ కు వచ్చే ప్రముఖులు ఎవరైనా సరే ప్యారడైజ్ బిర్యానీని రుచి చూడకుండా ఇక్కడ నుంచి వెళ్లలేరు. క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, కాంగ్రెస్ పార్టీ కొత్త అధ్యక్షుడు రాహుల్ గాంధీలు కూడా ఈ బిర్యానీకి దాసోహమయినవారే. తాజాగా, ఈ బిర్యానీ విజయవాడవాసులకు అందుబాటులోకి వచ్చింది. నిన్న ఉదయం విజయవాడలోని బెంజ్ సర్కిల్ సమీంపంలో మొదటి ఔట్ లెట్ ను ప్యారడైజ్ ఫుడ్ కోర్ట్ సీఈవో గౌతమ్ గుప్తా ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తమ బిర్యానీ ద్వారా విజయవాడవాసుల మనసులను చూరగొనడమే తమ లక్ష్యమని చెప్పారు. రుచికి, శుచికి తాము అత్యధిక ప్రాధాన్యతను ఇస్తామని తెలిపారు. అన్ని వర్గాలకు చేరువయ్యేలా తమ మెనూ ఉంటుందని చెప్పారు.

More Telugu News