balakrishna: అనిల్ రావిపూడితోనే బాలయ్య నెక్స్ట్ మూవీ?

  • 'జై సింహా' పూర్తి చేసిన బాలకృష్ణ 
  • ఎస్వీ కృష్ణారెడ్డితో నెక్స్ట్ మూవీ అంటూ ప్రచారం 
  • అనిల్ రావిపూడికే గ్రీన్ సిగ్నల్ 
  • నిర్మాతగా దిల్ రాజు    

బాలకృష్ణ తన 102వ సినిమాను దర్శకుడు కె.ఎస్. రవికుమార్ తో కానిచ్చేశాడు. సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రావడానికి 'జై సింహా' రెడీ అవుతోంది. ఈ సినిమా తరువాత బాలకృష్ణ .. ఎన్టీఆర్ బయోపిక్ చేయవలసి వుంది. అందుకు సమయం ఉండటంతో, ఎస్వీ కృష్ణారెడ్డితో ఓ సినిమా చేయనున్నట్టు వార్తలు వచ్చాయి. ఫాంటసీ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో బాలకృష్ణ 'అంతరిక్ష యాత్రికుడు'గా కనిపించనున్నట్టు ప్రచారం జరిగింది.

అయితే అనిల్ రావిపూడితో కలిసి సెట్స్ పైకి వెళ్లడానికే బాలకృష్ణ నిర్ణయించుకున్నాడనేది తాజా సమాచారం. బాలకృష్ణ 100వ సినిమా సమయంలోనే అనిల్ రావిపూడి ఆయనకి కథ వినిపించాడు. కానీ అప్పుడు బాలకృష్ణ 'శాతకర్ణి'పై ఆసక్తిని చూపించారు. ఈ లోగా కొన్ని ప్రాజెక్టులను పూర్తి చేసిన అనిల్ రావిపూడి, వరుస సక్సెస్ ల కారణంగా బాలకృష్ణను ఒప్పించాడట. దిల్ రాజు నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.   

More Telugu News