Russel Arnold: ట్వీట్ లో కాలేసిన రసెల్... దిమ్మతిరిగే షాకిచ్చిన వీవీఎస్!

  • 5-0 తేడాతో ఓడిపోబోము
  • ప్రామిస్ చేస్తున్నానన్న రసెల్
  • మూడు మ్యాచ్ ల్లో 5-0 ఓటమి ఉండదులే
  • నీ జోస్యం నిజమవుతుందన్న లక్ష్మణ్

శ్రీలంక మాజీ క్రికెటర్ రసెల్ అర్నాల్డ్ ఓ ట్వీట్ పెడుతూ, చేసిన చిన్న తప్పు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ పై మాజీ స్టార్ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ సైతం తనదైన శైలిలో స్పందించాడు. తన ట్విట్టర్ ఖాతాలో రసెల్, "1-0 తేడాతో టెస్టు సిరీస్ ను ఓడిపోయాము. వన్డేల్లో మాత్రం కొద్ది నెలల క్రితం జరిగినట్టుగా 5-0 తేడాతో ఓడిపోబోమని ప్రామిస్ చేస్తున్నా" అన్నాడు.

ఇక దీనిపై స్పందించిన లక్ష్మణ్, "నిజమే రసెల్. మూడు మ్యాచ్ ల సిరీస్ లో అది జరగదులే. నీ జోస్యం నిజమవుతుంది" అని రసెల్ దిమ్మతిరిగే ట్వీటేశాడు. ప్రస్తుత వన్డే సిరీస్ లో భాగంగా ఇండియా, శ్రీలంక జట్లు మూడు మ్యాచ్ లు మాత్రమే ఆడుతాయన్న సంగతి తెలిసిందే. ఆ విషయాన్ని రసెల్ మరచిపోయి 5-0 తేడాను ప్రస్తావించగా, లక్ష్మణ్ చక్కగా స్పందించాడని నెటిజన్లు కితాబిస్తున్నారు.

More Telugu News