Cricket: శ్రీలంక‌తో వ‌న్డే సిరీస్‌.. భార‌త జ‌ట్టులో స్వ‌ల్ప మార్పులు చేసిన బీసీసీఐ

  • శ్రీలంక‌తో రేప‌టి నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌
  • గాయంతో బాధ‌ప‌డుతోన్న‌ కేదార్‌ జాదవ్‌కు విశ్రాంతి
  • జట్టులోకి సుందర్‌.. కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ‌

శ్రీలంక‌తో రేప‌టి నుంచి ప్రారంభం కానున్న వన్డే సిరీస్‌కు బీసీసీఐ భార‌త ఆట‌గాళ్ల‌ను ప్రకటించింది. గాయంతో బాధ‌ప‌డుతోన్న‌ కేదార్‌ జాదవ్ కు విశ్రాంతి ఇచ్చారు. కొత్త ఆట‌గాడు సుందర్‌ను జట్టులోకి తీసుకున్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ సెల‌వు తీసుకున్న నేపథ్యంలో, ఈ సిరీస్‌కు భార‌త కెప్టెన్‌గా రోహిత్ శ‌ర్మ వ్య‌వ‌హ‌రిస్తాడ‌ని బీసీసీఐ ఇప్పటికే ప్ర‌క‌టించింది. వ‌న్డే సిరీస్‌ జట్టులో రోహిత్ శర్మ (సార‌థి), శిఖర్ ధావన్, అజింక్య రహానే, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే, దినేశ్ కార్తీక్, మ‌హేంద్ర సింగ్‌ ధోనీ, హార్ధిక్ పాండ్యా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, బూమ్రా, యజువేంద్ర చహల్, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, సుందర్ ఉన్నారు.

More Telugu News