au: ఏయూలో త‌న స్నేహితుల‌ని క‌లిసిన వెంక‌య్య నాయుడు!

  • ఆంధ్రా విశ్వ‌విద్యాల‌యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం
  • హాజ‌రైన వెంక‌య్య నాయుడు, గంటా శ్రీనివాసరావు
  • త‌మ‌ మిత్రుల‌తో స‌ర‌దా‌గా గ‌డుపుతోన్న పూర్వ విద్యార్థులు

విశాఖపట్నంలోని ఆంధ్రా విశ్వ‌విద్యాల‌యంలో పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరుగుతోంది. ఏయూ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్‌లో ఉప రాష్ట్ర‌ప‌తి వెంక‌య్య నాయుడు ఈ స‌మావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశానికి ఏపీ మంత్రి గంటా శ్రీనివాసరావు స‌హా పలువురు పూర్వ విద్యార్థులు భారీగా హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా తరగతి గదిలో స్నేహితులతో వెంకయ్య నాయుడు కాసేపు స‌ర‌దాగా గడిపారు. కాలేజీ మిత్రుల‌తో గడపడం ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేశారు. పూర్వ విద్యార్థులు త‌మ స్నేహితుల‌ను క‌లిసి ఫొటోలు తీసుకుంటూ స‌ర‌దాగా గడుపుతున్నారు.    

More Telugu News