thieft: బుర‌ఖాలో వ‌చ్చి.. హైద‌రాబాద్‌లోని ల‌లితా జ్యూవెల‌ర్స్‌లో చోరీ!

  • రూ.6 ల‌క్ష‌ల విలువైన బంగారు హారాన్ని కొట్టేసిన ఇద్ద‌రు మ‌హిళ‌లు
  • బంగారు హారం స్థానంలో రోల్డ్ ‌గోల్డ్ హారం ఉంచిన వైనం
  • సీసీటీవీ కెమెరా సాయంతో గుర్తింపు

'డ‌బ్బులు ఊరికే రావు' అంటూ ఇటీవల మీడియాలో విపరీతమైన ప్రచారాన్ని చేసుకుని, కస్టమర్లను బాగా ఆకర్షించిన లలితా జ్యూవెలర్స్ షాపులో చోరీ జరిగింది. ఈ రోజు ఇద్దరు లేడీ కేడీలు ల‌లితా జ్యువెల‌ర్స్ సిబ్బందికి షాక్ ఇచ్చారు.

 బుర‌ఖా ధ‌రించి హైదరాబాద్‌లోని పంజాగుట్ట ల‌లితా జ్యువెల‌ర్స్ లోకి వ‌చ్చిన ఇద్ద‌రు మ‌హిళ‌లు రూ.6 ల‌క్ష‌ల విలువైన బంగారు హారాన్ని కొట్టేసి జంప్ అయ్యారు. ఈ విష‌యాన్ని గుర్తించిన సిబ్బంది సీసీటీవీలో ప‌రిశీలించ‌గా స‌ద‌రు మ‌హిళ‌లు బంగారు హారం స్థానంలో రోల్డ్ గోల్డ్ హారం ఉంచి ప‌రార‌యిన‌ట్లు తెలిసింది. స‌ద‌రు మ‌హిళ‌ల కోసం పోలీసులు గాలిస్తున్నారు. 

More Telugu News