Sonia gandhi: ప్ర‌ధాని ప‌ద‌వి కన్నా ప్రజాసేవే ముఖ్యమని సోనియా భావించారు: ఏపీసీసీ

  • ఏపీసీసీ కార్యాల‌యంలో సోనియా గాంధీ 71వ పుట్టిన‌రోజు వేడుక‌
  • ప్రజా సేవే ముఖ్య‌మ‌ని సోనియా గాంధీ భావించారు
  • మ‌హోన్న‌త రాజ‌నీతి ఉన్న‌ నాయ‌కురాలు
  • అటువంటి నాయ‌కురాలి నాయ‌క‌త్వంలో ప‌ని చేయ‌డం మా అదృష్టం

ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌వి క‌న్నా ప్రజా సేవే ముఖ్య‌మ‌ని త‌మ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ భావించార‌ని ఏపీసీసీ నేత‌లు అన్నారు. ప్ర‌ధాన‌మంత్రి ప‌ద‌విని త్యాగం చేసి కాంగ్రెస్ పార్టీ కోసం పేద‌, బ‌ల‌హీన వ‌ర్గాల అభివృద్ధి కోసం ఆమె కృషి చేశార‌ని చెప్పారు. విజ‌య‌వాడ‌లోని ఏపీసీసీ కార్యాల‌యంలో ఈ రోజు సోనియా గాంధీ 71వ పుట్టిన‌రోజు వేడుక‌ను జ‌రుపుకున్నారు.

ఈ సంద‌ర్భంగా మ‌హిళ‌ల‌కు చీర‌లు పంపిణీ చేశారు. మ‌హోన్న‌త రాజ‌నీతి ఉన్న‌ నాయ‌కురాలు సోనియా గాంధీ మాత్ర‌మేన‌ని ఏపీసీసీ నేత‌లు కొనియాడారు. అటువంటి నాయ‌కురాలి నాయ‌క‌త్వంలో ప‌ని చేయ‌డం త‌మ అదృష్ట‌మ‌ని వ్యాఖ్యానించారు.      

More Telugu News