penamaluru nri association: అమెరికాలో టీడీపీ ఎమ్మెల్యే ప్రసాద్ కు ఘన సన్మానం!

  • ఘనంగా సత్కరించిన పెనమలూరు ఎన్నారై అసోసియేషన్
  • టీడీపీ విజయానికి కలసికట్టుగా కృషి చేద్దామంటూ పిలుపు
  • తెలుగువారందరికీ చంద్రబాబే ఆదర్శమన్న ప్రసాద్

టీడీపీ పెనమలూరు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ ను అమెరికాలోని ఫీనిక్స్ లో పెనమలూరు ఎన్నారై అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆయన చేస్తున్న కృషిని ప్రశంసిస్తూ సన్మానించారు. ఈ సందర్భంగా ఎన్నారై సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ, వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించేందుకు అందరం కలసికట్టుగా కృషి చేద్దామంటూ పిలుపునిచ్చారు.

బోడే ప్రసాద్ మాట్లాడుతూ, ప్రపంచంలోని తెలుగువారందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబే ఆదర్శమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎన్నారైలు తోటకూర సుబ్బారావు, కోడే జయరాం, బొడ్డపాటి అనిల్, కొమ్మినేని వెంకటేష్, అనుమోలు బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

More Telugu News