Jagan: హైదరాబాద్ నుంచి అనంత‌పురానికి బ‌య‌లుదేరిన జ‌గ‌న్!

  • అక్ర‌మాస్తుల కేసులో ముగిసిన నేటి విచార‌ణ‌
  • రోడ్డు మార్గంలో బ‌య‌లుదేరిన జ‌గ‌న్‌
  • రేపు సింగనమల నియోజకవర్గంలోని పాపినేని పాలెంలో పాద‌యాత్ర‌

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఈ రోజు హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి సీబీఐ కోర్టుకు హాజ‌రైన విష‌యం తెలిసిందే. అక్ర‌మాస్తుల కేసులో ఈ రోజు విచార‌ణ ముగియ‌డంతో ఆయ‌న తిరిగి పాద‌యాత్ర చేయ‌డానికి రోడ్డు మార్గంలో అనంత‌పురం బ‌య‌లుదేరారు. వాదనలు ముగిసిన త‌రువాత న్యాయమూర్తి ఈ కేసు విచారణను వ‌చ్చే శుక్ర‌వారానికి వాయిదా వేశారు. ఈ రోజు రాత్రికి జగన్ అనంతపురం జిల్లాలోని సింగనమల నియోజక వర్గంలోని బాపనపల్లికి చేరుకుంటారు. రేప‌టి నుంచి మ‌ళ్లీ పాద‌యాత్ర ప్రారంభిస్తారు. రేపు ఉదయం సింగనమల నియోజకవర్గంలోని పాపినేని పాలెంలో ప్ర‌జ‌ల‌తో స‌మావేశం అవుతారు.      

More Telugu News