Jagan: హైద‌రాబాద్‌లోని నాంప‌ల్లి సీబీఐ కోర్టులో వైఎస్ జ‌గ‌న్‌!

  • అక్ర‌మాస్తుల కేసులో విచార‌ణ‌కు హాజ‌రు
  • అనంత‌పురం నుంచి నిన్న సాయంత్ర‌మే హైద‌రాబాద్‌కు జ‌గ‌న్‌
  • ఈ రోజు సాయంత్రం 4గంట‌ల వ‌ర‌కు కోర్టులోనే వైసీపీ అధినేత‌
  • అనంత‌రం తిరిగి అనంత‌పురానికి

నిన్న సాయంత్రం వ‌ర‌కు అనంతపురంలోని గార్లదిన్నె మండలం బాపినేపాళ్యంలో పాద‌యాత్ర చేసిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహ‌న్‌రెడ్డి అక్క‌డి నుంచి బ‌య‌లుదేరి నిన్న రాత్రి హైదరాబాద్‌‌కు చేరుకున్నారు. అక్ర‌మాస్తుల కేసులో న‌గ‌రంలోని నాంప‌ల్లి సీబీఐ కోర్టుకు జగన్ ఈ రోజు హాజరయ్యారు. ఈ రోజు సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు జ‌గ‌న్ కోర్టులోనే ఉండ‌నున్న‌ట్లు స‌మాచారం.

విచార‌ణ పూర్త‌యిన తరువాత మ‌ళ్లీ జ‌గ‌న్ పాద‌యాత్ర కోసం అనంత‌పురం వెళ్ల‌నున్నారు. వ్య‌క్తిగ‌త హాజ‌రును మిన‌హాయించాల‌ని గ‌తంలో జ‌గ‌న్ వేసిన పిటిష‌న్‌ను కోర్టు అంగీక‌రించ‌ని విష‌యం తెలిసిందే. దీంతో జ‌గ‌న్ ప్ర‌తి శుక్ర‌వారం విచారణ కోసం కోర్టుకు హాజ‌రుకావలసి వస్తోంది.  

More Telugu News