Virat Kohli: సెల‌వు పెట్టిన కోహ్లీ చిన్న‌నాటి కోచ్‌.. విరాట్‌-అనుష్క‌ పెళ్లి కోస‌మే అంటూ ప్ర‌చారం!

  • ఈ నెల 12న కోహ్లీ-అనుష్క‌ల పెళ్లంటూ ప్ర‌చారం
  • ఇదే స‌మ‌యంలో డీడీసీఏను సెల‌వు కోరిన రాజ్‌కుమార్ శ‌ర్మ‌
  • రేపు సీకే నాయుడు ట్రోఫీ సెమీఫైన‌ల్‌కు హాజ‌రుకావాల్సి ఉన్న శర్మ‌

ఈ నెల 12న‌ ఇటలీలో టీమిండియా కెప్టెన్ విరాట్‌ కోహ్లీ, బాలీవుడ్ న‌టి అనుష్కల వివాహం జ‌ర‌గ‌నుంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోన్న విష‌యం తెలిసిందే. ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని అనుష్క ప్రతినిధి ప్రకటన కూడా చేశారు. అయితే, ఇదే స‌మ‌యంలో విరాట్‌ కోహ్లీ చిన్ననాటి కోచ్‌ రాజ్‌కుమార్‌ శర్మ సెల‌వు పెట్ట‌డం ప‌ట్ల ప‌లు అనుమానాలు వ్య‌క్తం అవుతున్నాయి. సీకే నాయుడు ట్రోఫీలో భాగంగా రేపు జ‌ర‌గ‌నున్న సెమీ ఫైన‌ల్‌లో రేపు ఢిల్లీ త‌ల‌ప‌డ‌నుంది.

ఢిల్లీ టీమ్‌కి కోచ్‌గా రాజ్‌కుమార్‌ అందుబాటులో ఉండాల్సి ఉంది. కీల‌క‌మైన మ్యాచ్‌కు హాజ‌రుకాకుండా ఢిల్లీ క్రికెట్‌ అసోసియేషన్‌(డీడీసీఏ)ను ఆయ‌న సెల‌వు కోర‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. కోహ్లీ-అనుష్క వివాహ వేడుక‌కు హాజ‌రు కావ‌డానికే ఆయ‌న సెల‌వు పెట్టార‌ని అభిమానులు అనుకుంటున్నారు. 

  • Loading...

More Telugu News