allu shirish: భారీ రేటుకు 'ఒక్క క్షణం' శాటిలైట్ రైట్స్

  • అల్లు శిరీష్ హీరోగా 'ఒక్క క్షణం'
  • కథానాయికలుగా సురభి .. శీరత్ కపూర్ 
  • శాటిలైట్ రైట్స్ కోసం గట్టిపోటీ    

అల్లు శిరీష్ కథానాయకుడిగా వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో 'ఒక్క క్షణం' సినిమా రూపొందుతోంది. సురభి .. శీరత్ కపూర్ కథానాయికలుగా నటించిన ఈ సినిమాను, ఈ నెల 29వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా టీజర్ బయటికి వచ్చిన తరువాత అమాంతంగా అంచనాలు పెరిగిపోయాయి.

గతంలో వి.ఐ.ఆనంద్ దర్శకత్వం వహించిన 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' సినిమా ఘన విజయాన్ని సాధించడం, ఈ స్థాయిలో అంచనాలు పెరగడానికి కారణమైంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా శాటిలైట్ రైట్స్ కి గట్టిపోటీ ఏర్పడింది. చివరికి జెమినీ టీవీవారు శాటిలైట్ రైట్స్ ను సొంతం చేసుకున్నారు. ఇందుకోసం వాళ్లు 3.20 కోట్లను చెల్లించినట్టు తెలుస్తోంది. అల్లు శిరీష్ కెరియర్లో శాటిలైట్స్ రైట్స్ ఈ స్థాయిలో పలకడం ఇదే మొదటిసారి అని అంటున్నారు. వి.ఐ.ఆనంద్ నుంచి వస్తోన్న ఈ సినిమా, వసూళ్ల పరంగా దూసుకుపోతుందేమో చూడాలి మరి.    

More Telugu News