engineering students: బైక్‌పై వెళుతోన్న ఇంజనీరింగ్‌ విద్యార్థులను ఢీకొన్న టిప్పర్‌.. ఇద్ద‌రు విద్యార్థుల మృతి!

  • హైద‌రాబాద్ శివారులోని ఆదిభట్లలో ఘ‌ట‌న‌
  • పోలీసుల‌కు స‌మాచారం అందించిన స్థానికులు
  • పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి మృతదేహాల తరలింపు

బైక్‌పై వెళుతోన్న‌ ఇద్దరు ఇంజనీరింగ్‌ విద్యార్థులను ఓ టిప్పర్‌ డీకొట్టిన ఘ‌ట‌న హైద‌రాబాద్ శివారులోని ఆదిభట్లలో చోటు చేసుకుంది. ఈ రోడ్డు ప్ర‌మాదంలో ఇద్దరు విద్యార్థులు అక్క‌డికక్క‌డే ప్రాణాలు కోల్పోయారు. ఈ రోడ్డు ప్ర‌మాదంపై స్థానికులు పోలీసులకు స‌మాచారం అందించ‌డంతో అక్క‌డికి చేరుకున్న పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

ఇద్ద‌రు విద్యార్థుల‌ మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన విద్యార్థులు స్థానిక ఇంజ‌నీరింగ్ కాలేజీలో బీటెక్ చదువుతున్నట్టు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై పూర్తి వివరాలు అందాల్సి ఉంది.   

More Telugu News