విరాట్ కోహ్లీ ఆరో డబుల్ సెంచరీ.. ఇండియా 451/4
- శ్రీలంకతో న్యూఢిల్లీలో టెస్టు మ్యాచ్
- రెండో రోజూ రెచ్చిపోయిన కెప్టెన్ కోహ్లీ
- టెస్టుల్లో ఆరో డబుల్ సెంచరీ నమోదు
- భారీ ఆధిక్యంలో భారత్
ఆ తరువాత బరిలోకి దిగిన రహానే నిరాశపరుస్తూ ఒక్క పరుగుకే అవుట్ అయినప్పటికీ, కోహ్లీలో జోరు తగ్గలేదు. మరో ఎండ్ లో రోహిత్ శర్మ నుంచి మంచి సపోర్టు లభిస్తుండటంతో తనదైన షాట్లతో చెలరేగిపోయాడు. ఈ క్రమంలో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అందుకోసం 238 బంతులను కోహ్లీ వాడుకున్నాడు. 20 ఫోర్లు కొట్టాడు. అతనికి తోడుగా ప్రస్తుతం రోహిత్ శర్మ 40 పరుగులతో క్రీజులో ఉండగా, భారత్ స్కోరు 4 వికెట్ల నష్టానికి 451 పరుగులు.