vaani kapoor: న‌టి వాణీ క‌పూర్, ఆమె త‌ల్లిదండ్రుల‌ మీద చీటింగ్ కేసు

  • ల్యాండ్ మాఫియాతో సంబంధం?
  • వివాదాల్లో ఉన్న భూమిని అమ్మిన వాణీ త‌ల్లిదండ్రులు
  • ఖండించిన వాణీ క‌పూర్ కుటుంబం

తెలుగులో 'ఆహా క‌ల్యాణం' సినిమాతో తెరంగేట్రం చేసిన బాలీవుడ్ న‌టి వాణీ క‌పూర్‌, ఆమె కుటుంబం మీద భూవివాదం విష‌యంలో చీటింగ్ కేసు న‌మోదైన‌ట్లు తెలుస్తోంది. నోయిడాలో బ్యాంకు తాక‌ట్టులో ఉన్న భూమిని త‌మ‌కు అమ్మారంటూ రేణు త్యాగి అనే మ‌హిళ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. వాణీ క‌పూర్ త‌ల్లిదండ్రులు శివ్‌, డింపీలు 2008లో ఈ భూమిని త‌మ‌కు అమ్మార‌ని, 2015లో ఈ భూమి బ్యాంకు తాకట్టులో ఉన్న‌ట్లు తెలిసింద‌ని, దీని గురించి వివ‌ర‌ణ అడిగితే క‌పూర్ కుటుంబం స‌రిగ్గా స్పందించ‌లేద‌ని రేణు ఫిర్యాదులో పేర్కొంది.

అయితే వాణీ క‌పూర్ కుటుంబం మాత్రం రేణు త్యాగి ఆరోప‌ణ‌ల‌ను ఖండించింది. రేణు త్యాగి భ‌ర్త‌కు మాఫియాతో సంబంధాలు ఉన్నాయ‌ని, ఈ భూవివాదం వంక‌తో త‌మ ద‌గ్గ‌రి నుంచి ఎక్కువ డ‌బ్బులు లాగడానికి ప్ర‌య‌త్నిస్తున్నార‌ని అన్నారు. ఈ కేసుకు సంబంధించి ఆధారాల‌న్నీ వాణీ క‌పూర్ కుటుంబానికి మ‌ద్ద‌తుగానే ఉన్నాయ‌ని శివ్ క‌పూర్ ద‌గ్గ‌రి స్నేహితుడు ఒక‌రు చెప్పారు.

More Telugu News