Kodandaram: 'కొలువుల‌కై కొట్లాట' స‌భ‌కు ముహూర్తం ఖ‌రారు.. సభా వేదికకు శ్రీకాంతాచారి పేరు

  • హైద‌రాబాద్ లోని స‌రూర్‌న‌గ‌ర్‌లో ఎల్లుండి స‌భ‌
  • మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు
  • హాజ‌రుకానున్న ప్ర‌తిప‌క్ష నేత‌లు
  • ప్ర‌క‌టించిన ప్రొ.కోదండ‌రామ్‌

తెలంగాణ ప్ర‌భుత్వం ఉద్యోగాల భ‌ర్తీ చేయ‌డం లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోన్న టీజేఏసీ కొలువుల‌కై కొట్లాట స‌భ‌ను నిర్వ‌హించాల‌ని అన్ని ఏర్పాట్ల‌ను పూర్తి చేసుకుంటోన్న విష‌యం తెలిసిందే. ఈ రోజు ఈ విష‌యంపై హైద‌రాబాద్‌లో మీడియాతో మాట్లాడిన టీజేఏసీ ఛైర్మ‌న్ ప్రొ.కోదండ‌రామ్... ఈ విష‌య‌మై ప్ర‌క‌ట‌న చేశారు. హైద‌రాబాద్ లోని స‌రూర్‌న‌గ‌ర్‌లో ఎల్లుండి (సోమవారం) మధ్యాహ్నం 1 గంట నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ సభను నిర్వహిస్తామని వెల్ల‌డించారు.

ఈ సభా ప్రాంగణానికి అమరవీరుల ప్రాంగణం అని, సభా వేదికకు శ్రీకాంతాచారి వేదిక అని పేరు పెట్టినట్లు ప్రొ.కోదండ‌రామ్‌ చెప్పారు. రాష్ట్రంలోని పట్టణ ప్రాంతాల్లో నిరుద్యోగ సమస్య అధికంగా ఉంద‌ని తెలిపారు. స‌ర్కారు ఉద్యోగాల ఖాళీల సంఖ్యపై ప్రభుత్వం రోజుకోలా మాట్లాడుతోంద‌ని అన్నారు. ఈ స‌భ‌కు ప్ర‌తిప‌క్ష నేత‌లు కూడా హాజ‌ర‌వుతార‌ని చెప్పారు.

More Telugu News