nizamabad: బీజేపీ మాజీ నేత‌ భ‌ర‌త్ రెడ్డి అవ‌మానించిన‌ ఇద్ద‌రు ద‌ళిత యువ‌కుల ఆచూకీ ల‌భ్యం!

  • గత నెలలో నిజామాబాద్‌ జిల్లాలోని నవీపేటలో ఘ‌ట‌న‌
  • ద‌ళిత యువ‌కుల‌ను కొట్టి, మురికి నీటిలోకి దించిన భ‌ర‌త్‌రెడ్డి
  • 20 రోజులుగా క‌న‌ప‌డ‌ని యువ‌కులు
  • భ‌ర‌త్‌రెడ్డే కిడ్నాప్ చేశాడా? అనే విష‌యంపై ఆరా

గత నెలలో నిజామాబాద్‌ జిల్లాలోని నవీపేటలో భార‌తీయ జ‌నతా పార్టీ మాజీ నేత భరత్ రెడ్డి ఇద్ద‌రు దళిత యువ‌కులను కొట్టి, వారిని మురికి నీటిలో దించిన విష‌యం తెలిసిందే. ఆ దృశ్యాలు సోష‌ల్ మీడియాలోనూ హ‌ల్‌చ‌ల్ చేశాయి. 20 రోజుల నుంచి క‌నపడ‌కుండా పోయిన ఆ ఇద్ద‌రు యువ‌కుల ఆచూకీ ఈ రోజు పోలీసుల‌కి ల‌భ్య‌మైంది. ఆ ఇద్ద‌రు యువ‌కుల‌ను పోలీసులు హైదరాబాద్‌లో అదుపులోకి తీసుకున్నారు. వారిని భ‌ర‌త్‌రెడ్డి కిడ్నాప్ చేశాడ‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ విష‌యంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. కాగా, గత నెలలో భరత్ రెడ్డి పాల్ప‌డుతోన్న‌ అక్రమ ఇసుక రవాణాపై దళిత యువ‌కులు లక్ష్మణ్, రాజేశ్వర్ ప్ర‌శ్నించ‌గా స‌ద‌రు నేత ఈ దారుణానికి పాల్ప‌డ్డాడు.                                                                                                                                                                                                                                (గ‌త నెల‌లో వెలుగులోకొచ్చిన వీడియో)




More Telugu News