polavaram: పోల‌వ‌రంపై అగ్గి రాజుకుంటోన్న నేప‌థ్యంలో వైసీపీ నేత‌ల కీల‌క భేటీ!

  • హైద‌రాబాద్ లోట‌స్‌పాండ్‌లోని పార్టీ కార్యాల‌యంలో స‌మావేశం
  • హాజ‌రైన‌ విజ‌య సాయిరెడ్డి, ధ‌ర్మాన, బొత్స
  • పోల‌వ‌రం అంశంపై అనుస‌రించాల్సిన తీరుపై చ‌ర్చ‌లు

పోల‌వ‌రంపై అగ్గి రాజుకుంటోన్న నేప‌థ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత‌లు ఈ అంశంపై చ‌ర్చించేందుకు భేటీ అయ్యారు. హైద‌రాబాద్ లోట‌స్‌పాండ్‌లోని త‌మ‌ కార్యాల‌యంలో వైసీపీ నేత‌లు విజ‌య‌ సాయిరెడ్డి, ధ‌ర్మాన ప్ర‌సాద రావు, బొత్స స‌త్య‌నారాయ‌ణ‌, ఇత‌ర ముఖ్య‌నేత‌లు ఈ భేటీకి హాజ‌ర‌య్యారు. కేంద్ర ప్ర‌భుత్వ తీరుపై ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఊహించ‌ని రీతిలో వ్యాఖ్య‌లు చేసిన నేప‌థ్యంలో పోల‌వ‌రంపై త‌మ‌ పార్టీ అనుస‌రించాల్సిన వైఖ‌రిపై వైసీపీ చ‌ర్చిస్తోంది. ఈ రోజు సాయంత్రం వైసీపీ నేత‌లు మీడియా స‌మావేశంలో మాట్లాడే అవ‌కాశం ఉన్న‌ట్లు తెలుస్తోంది.  

More Telugu News