sri vunsnu: ఇప్పటివరకూ ఎవరూ ఇంతగా మెచ్చుకోలేదు!: హీరో శ్రీవిష్ణు

  • 'మెంటల్ మదిలో'కి మంచి ఆదరణ 
  • రామానాయుడు స్టూడియోలో సక్సెస్ మీట్ 
  • ప్రేక్షకులకు ధన్యవాదాలు చెప్పిన శ్రీ విష్ణు  

రాజ్ కందుకూరి నిర్మాణంలో .. వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో విష్ణు హీరోగా రూపొందిన 'మెంటల్ మదిలో' చిత్రం ఈ నెల 24వ తేదీన ప్రేక్షకుల ముందుకువచ్చింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోను ఈ సినిమా మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా టీమ్ హైదరాబాద్ .. రామానాయుడు స్టూడియోలో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.

 ఈ సక్సెస్ మీట్ లో శ్రీవిష్ణు మాట్లాడుతూ .. "చిన్నప్పుడు స్కూల్లో నేను బిలో ఏవరేజ్ స్టూడెంట్ ను .. అందువలన నన్ను ఎవరూ మెచ్చుకునేవారు కాదు. అప్పటి నుంచి ఇప్పటివరకూ కూడా నన్నెవ్వరూ మెచ్చుకోలేదు. కానీ ఈ సినిమా రిలీజైన దగ్గర నుంచి అంతా ఆహా .. ఓహో అంటున్నారు. ఇప్పుడు నేను పొందుతోన్న ఆనందం అంతా ఇంతా కాదు. దీనంతటికి కారణం ఈ సినిమాను ఆదరించిన ప్రేక్షకులు .. వాళ్లకి ధన్యవాదాలు. ఈ సినిమా ద్వారా నాకు ఇంతటి గుర్తింపును ఇచ్చిన దర్శకుడు వివేక్ ఆత్రేయకి .. నిర్మాత రాజ్ కందుకూరికి కృతజ్ఞతలు" అని చెప్పారు.   

More Telugu News