sai dharam tej: ఎన్టీఆర్ .. చరణ్ మల్టీస్టారర్ లో నేను చేయడం లేదు: సాయిధరమ్ తేజ్

  • ఎన్టీఆర్ .. చరణ్ లతో రాజమౌళి 
  • సాయిధరమ్ తేజ్ కూడా ఉన్నాడంటూ ప్రచారం 
  • క్లారిటీ ఇచ్చిన తేజు 
  • మల్టీ స్టారర్ మూవీస్ కి సిద్ధమంటూ స్పష్టం  

సాయిధరమ్ తేజ్ హీరోగా చేసిన 'జవాన్' చిత్రం ఈ రోజునే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రస్తుతం ఆయన చేతిలో వినాయక్ .. కరుణాకరన్ సినిమాలు వున్నాయి. కొంతమంది దర్శకులు ఆయనతో సినిమాలు చేయడానికి రెడీగా వున్నారు. ఈ నేపథ్యంలో రాజమౌళి సినిమాలో సాయిధరమ్ తేజ్ కూడా కనిపించనున్నాడంటూ ఒక ప్రచారం ఊపందుకుంది.

 ఎన్టీఆర్ .. చరణ్ లతో ఇటీవల రాజమౌళి దిగిన ఓ ఫోటో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. "వీళ్ల కాంబినేషన్లో ఒక సినిమా రానుందనే విషయం తెలిసి మొదటి నేను కూడా పుకారేనని అనుకున్నాను .. నిజమని తెలిసి చాలా థ్రిల్ ఫీలయ్యాను" అంటూ ఓ ఇంటర్వ్యూలో సాయిధరమ్ తేజ్ చెప్పాడు. అప్పటి నుంచి ఈ సినిమాలో ఆయన కూడా ఉన్నాడని చెప్పుకుంటున్నారు. తాజాగా ఈ విషయపై తేజు స్పందిస్తూ .. ఎన్టీఆర్ - చరణ్ లతో రాజమౌళి చేస్తోన్న సినిమాలో తాను లేనని చెప్పాడు. కథ కుదిరితే మల్టీ స్టారర్ సినిమాలు చేయడానికి తాను సిద్ధంగానే వున్నానంటూ స్పష్టం చేశాడు. 

More Telugu News