rahul gandhi: ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ హిందువు కాదు: క‌పిల్ సిబ‌ల్

  • సోమ్‌నాథ్‌ దేవాలయంలో నాన్-హిందుగా పేర్కొన్న రాహుల్‌పై బీజేపీ విమ‌ర్శ‌లు
  • మోదీపై క‌పిల్ సిబల్ విమ‌ర్శ‌లు
  • హిందూయిజానికీ-హిందుత్వకూ తేడా ఉంది
  • మోదీ అనుసరించేది హిందుత్వం

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నికల నేప‌థ్యంలో కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నిన్న సోమ్‌నాథ్‌ దేవాల‌యానికి వెళ్లిన విష‌యం తెలిసిందే. అయితే, ఎంట్రీ బుక్‌లో ఆయ‌న నాన్‌-హిందువుగా పేర్కొన‌డం వివాదానికి తావిచ్చింది. త‌మ నేతపై బీజేపీ నేత‌లు విమ‌ర్శ‌లు చేస్తోన్న నేప‌థ్యంలో స్పందించిన కాంగ్రెస్‌ సీనియర్‌ నేత కపిల్‌ సిబల్ ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీనే హిందువు కాద‌ని వ్యాఖ్యానించారు. మోదీ అనుసరించేది హిందుత్వమని, హిందూయిజానికీ-హిందుత్వకూ తేడా ఉందని తెలిపారు. న‌రేంద్ర‌ మోదీ తరచూ దేవాలయాలకు వెళుతుంటారా? అని ఆయ‌న అడిగారు. నిజ‌మైన హిందువు అంటే ప్రతి భారతీయుడిలోనూ సోదరుడు, సోదరి, తల్లిని చూసేవాడని హిత‌వు ప‌లికారు. 

More Telugu News