Jagan: జగన్ కాలికి బొబ్బలు.. చూసి తట్టుకోలేక పోయిన భారతి

  • బొబ్బలెక్కిన జగన్ అరికాళ్లు
  • విశ్రాంతి తీసుకోవాలని సూచించిన వైద్యులు
  • పాదయాత్ర కొనసాగిస్తానన్న జగన్

వైసీపీ అధినేత జగన్ చేపట్టిన ప్రజాసంకల్ప యాత్ర 22వ రోజుకు చేరుకుంది. కోర్టు విచారణ నేపథ్యంలో శుక్రవారాలు మినహా ఆయన పాదయాత్ర నిరంతరాయంగా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో, జగన్ అరికాళ్లకు బొబ్బలు వచ్చాయి. ఆయనకు ప్రాథమిక చికిత్స అందించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.

అయితే, వైద్యుల సూచనకు జగన్ ససేమిరా అన్నారు. పాదయాత్రను కొనసాగిస్తానని చెప్పారు. మరోవైపు, జగన్ వద్దకు ఆయన భార్య భారతి చేరుకున్నారు. ఈ సందర్భంగా తన భర్త కాళ్లకు ఉన్న బొబ్బలను చూసి ఆమె ఆందోళన చెందారు. 

More Telugu News