krishna: కృష్ణ అడగడమే ఆలస్యం రామారావుగారు ఒప్పేసుకున్నారు!: జి. ఆదిశేషగిరిరావు

  • 'పండంటికాపురం' 100 రోజుల ఫంక్షన్ కి రామారావుగారు ముఖ్య అతిథి 
  • ఆ సమయంలోనే కృష్ణగారు ఆ మాట అడిగారు 
  • అందుకు రామారావుగారు అంగీకరించారు 
  • అలా 'దేవుడు చేసిన మనుషులు' సెట్స్ పైకి వెళ్లింది    

కృష్ణ సొంత బ్యానర్ పై భారీ తారాగణంతో.. భారీ బడ్జెట్ తో నిర్మించబడిన చిత్రాలలో 'దేవుడు చేసిన మనుషులు' ఒకటి. ఈ సినిమాను గురించి ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో కృష్ణ సోదరుడు జి.ఆదిశేషగిరిరావు ప్రస్తావించారు.

 " విజయవాడలో ఏర్పాటు చేసిన 'పండంటికాపురం' హండ్రెడ్ డేస్ ఫంక్షన్ కి రామారావుగారిని చీఫ్ గెస్టుగా పిలిచాం. ఆ సందర్భంలో నెక్స్ట్ సినిమా తామిద్దరం కలిసి చేస్తే బావుంటుందనే అభిప్రాయాన్ని కృష్ణ వ్యక్తం చేశారు. అంతే కాకుండా, సభాముఖంగా రామారావుగారిని అడిగేశారు. దాంతో ఆయన ఎంత మాత్రం ఆలోచించకుండా 'చేసేద్దాం' అని చెప్పారు. అలా 'దేవుడు చేసిన మనుషులు' సినిమాకి బీజం పడింది. అయితే ఆ తరువాత కొన్ని కారణాల వలన గ్యాప్ వచ్చింది. రామారావుగారు ఇక ఈ సినిమా చేయరని అనుకున్నాం. కానీ ఒక సందర్భంలో ఆయనే ఈ ప్రాజెక్టు ఎంతవరకూ వచ్చిందని అడిగారు. అంతే .. ఆ మరుసటి రోజు నుంచే అందుకు సంబంధించిన పనులను మొదలుపెట్టేశాం" అని చెప్పుకొచ్చారు.   

More Telugu News