Kirron Kher: ఆ యువతి ఆటో ఎక్కకుండా వుంటే బాగుండేది: అత్యాచార బాధితురాలిపై బీజేపీ ఎంపీ కిరణ్ ఖేర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు!

  • చండీగఢ్‌లో ఆటో ఎక్కిన యువ‌తిపై అత్యాచారం
  • అమ్మాయిలు ఇటువంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలి
  • త‌ల్లిదండ్రులు త‌మ‌ అమ్మాయిలకు తగిన సూచనలు చేయాలి

చండీగఢ్‌లో ఓ ఆటోడ్రైవర్ స‌హా మ‌రో ఇద్ద‌రు వ్య‌క్తులు 22 ఏళ్ల ఓ యువతిపై అత్యాచారానికి తెగ‌బ‌డ్డారు. ఈ విష‌యంపై బాలీవుడ్‌ నటి, బీజేపీ ఎంపీ కిరణ్‌ ఖేర్ వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. తాజాగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఆ యువ‌తి ఎక్కిన‌ ఆటోలో డ్రైవర్ తో కలిపి అప్పటికే ముగ్గురు పురుషులు ఉన్నారని, అటువంట‌ప్పుడు అప్రమత్తంగా ఉండి ఆటో ఎక్క‌కుండా ఉంటే బాగుండేది క‌దా? అని ఆమె వ్యాఖ్యానించారు.

అమ్మాయిలు ఇటువంటి సమయంలో జాగ్రత్తగా ఉండాలని కిరణ్‌ ఖేర్ అన్నారు. త‌ల్లిదండ్రులు త‌మ‌ అమ్మాయిలకు తగిన సూచనలు చేయాలని వ్యాఖ్యానించారు. తాను కూడా ముంబయిలో ఉన్నప్పుడు టాక్సీల్లో ప్రయాణించేదాన్న‌ని, అయితే ట్యాక్సీ ఎక్కిన‌ప్పుడు వాటి నంబర్లను రాసుకునేదానిన‌ని అన్నారు. ఇటువంటి విష‌యాల్లో మీడియా కూడా అత్యుత్సాహం ప్ర‌ద‌ర్శించ‌కూడ‌ద‌ని, జాగ్ర‌త్త‌లు చెబితే బాగుంటుంద‌ని ఆమె చెప్పుకొచ్చారు. ఆమె మాట‌ల‌పై విప‌క్ష పార్టీల నేత‌లు మండిప‌డుతున్నారు. 

  • Loading...

More Telugu News