krishna: భానుమతితో చేయించాలనుకున్న ఆ పాత్రను జమునతో చేయించాము: జి.ఆదిశేషగిరిరావు

  • ముందుగా భానుమతి గారిని అనుకున్నాం 
  • ఆమె డేట్స్ సర్దుబాటు కాలేదు 
  • దాంతో జమున గారిని అడిగాము 
  • అప్పటికే ఆమె పాప్యులర్ హీరోయిన్    

హీరోగా .. దర్శక నిర్మాతగా కృష్ణ చేసిన సాహసాలు అన్నీ ఇన్నీ కావు. కృష్ణ సొంత బ్యానర్ పై నిర్మించిన సినిమా వ్యవహారాలను ఆయన సోదరుడు జి. ఆదిశేషగిరిరావు చూసుకునేవారు. తాజాగా ఆయన తెలుగు పాప్యులార్ టీవీతో మాట్లాడుతూ .. ఆనాటి విషయాలను పంచుకున్నారు. మాటల సందర్భంలో ఆయన 'పండంటి కాపురం' సినిమాను గురించి ప్రస్తావించారు.

" 'పండంటి కాపురం'లో ఓ ప్రత్యేకమైన పాత్ర కోసం భానుమతిగారిని అనుకున్నాం. డేట్స్ సర్దుబాటు కావడం లేదనీ, ఓ 6 నెలలు ఆగమని అన్నారు. అప్పటివరకూ ఆగే ఉద్దేశం లేకపోవడం వలన, ఆ పాత్రను జమునతో చేయించాలనుకున్నాం. అప్పటికే ఆమె పాప్యులర్ హీరోయిన్. ఎన్టీఆర్ .. ఏఎన్నార్ .. కృష్ణతోను సినిమాలు చేశారు. మరి ఈ సినిమాలో ప్రత్యేకమైన పాత్రా చేస్తారా .. లేదా? అనే అనుమానముతోనే వెళ్లి అడిగాము. తన పాత్ర గురించి అడిగి తెలుసుకుని ఆమె చేశారు. ఆ పాత్ర ఆమెకి మంచి పేరు తెచ్చిపెట్టింది" అని చెప్పుకొచ్చారు.        

More Telugu News