sai dharam tej: నాకు పెళ్లైంది.. ఇద్ద‌రు పిల్ల‌లు కూడా వున్నారు!: త‌న‌పై వ‌స్తోన్న రూమ‌ర్ల‌పై వ‌్యంగ్యంగా స్పందించిన సాయిధ‌ర‌మ్ తేజ్!

  • ఒక పాప‌కి ఆరేళ్లు.. ఒక‌రికి రెండేళ్లు
  • నా సంసారం హాయిగా సాగుతోంది
  • ప‌దేప‌దే రూమ‌ర్లను రాసిందే రాస్తున్నారు
  • నేను కూడా ఇదే విష‌యాన్ని ప‌దే ప‌దే చెబుతా

మెగా హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ న‌టించిన 'జ‌వాన్' సినిమా విడుద‌ల‌కు సిద్ధ‌మైన విష‌యం తెలిసిందే. ఈ సంద‌ర్భంగా రేడియో సిటీకి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న స‌ర‌దాగా మాట్లాడారు. సాయిధ‌ర‌మ్ తేజ్ ఒక‌రిని ప్రేమిస్తున్నార‌ని, పెళ్లి కూడా అయింద‌ని, ఇంట్లో గొడ‌వ అయింద‌ని పుకార్లు వస్తున్నాయి. తన‌పై వస్తోన్న పుకార్ల‌పై స్పందించిన తేజు, సరదాగా జోకు వేశాడు. త‌న‌కి ఎప్పుడో పెళ్ల‌యిపోయింద‌ని, ఇద్దరు పిల్లలు కూడా వున్నారని, ఒక పాప‌కి ఆరేళ్లు, ఒక పాప‌కి రెండేళ్లు అని.. పెద్ద పాప హాయిగా చ‌దువుకుంటోంద‌ని, త‌న కాపురం స‌జావుగా సాగిపోతోంద‌ని ప‌దే ప‌దే చెప్పాడు.

త‌నపై వ‌స్తోన్న‌ రూమ‌ర్లను ఎన్నిసార్లు ఖండించినా కొంద‌రు రాసిందే మ‌ళ్లీ మ‌ళ్లీ రాసి ప్ర‌చారం చేస్తున్నార‌ని సాయిధ‌ర‌మ్ తేజ్ అన్నాడు. అందుకే తాను కూడా త‌న‌కి ఇద్ద‌రు పిల్ల‌లు ఉన్నార‌ని ప‌దే ప‌దే చెప్పుకుంటున్నాన‌ని వ్యంగ్యంగా చెప్పాడు. ఎవ‌రు ఎలా రాసుకున్నా తానేం అన‌బోన‌ని అన్నాడు. త‌న‌పై ఎన్నో రూమ‌ర్లు వ‌స్తున్నాయ‌ని తెలిపాడు.         

More Telugu News