Mahesh Babu: 'భరత్ అనే నేను' తదుపరి షెడ్యూల్స్ వివరాలు!

  • రేపటి నుంచి హైదరాబాద్ లో తాజా షెడ్యూల్
  • తదుపరి షెడ్యూల్ తమిళనాడులో 
  • వచ్చేనెల 10 నుంచి 25 వరకూ 
  • ఏప్రిల్ 27న విడుదల         

కొరటాల శివ దర్శకత్వంలో 'భరత్ అనే నేను' షూటింగ్ చకచకా జరిగిపోతోంది. మహేశ్ బాబు .. కైరా అద్వాని జంటగా నటిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే చాలా వరకూ చిత్రీకరణను పూర్తి చేసుకుంది. మహేశ్ బాబు ముఖ్యమంత్రిగా కనిపించనున్నాడనేది అందరిలోనూ ఆసక్తిని రేకెత్తించే అంశంగా మారింది. ఈ నేపథ్యంలో తదుపరి షెడ్యూల్స్ వివరాలను ఓ పోస్టర్ ద్వారా ఈ సినిమా టీమ్ వెల్లడి చేసింది.

 రేపటి నుంచి వచ్చేనెల 7వ తేదీ వరకూ ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరగనుంది. ఆ తరువాత షెడ్యూల్ ను తమిళనాడులోని 'కరైకుడి'లో ప్లాన్ చేశారు. వచ్చేనెల 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకూ అక్కడ ఈ సినిమా షూటింగ్ కొనసాగనుంది. కొన్ని కీలకమైన సన్నివేశాలను అక్కడ తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను ఏప్రిల్ 27వ తేదీన విడుదల చేయనున్నారనే విషయాన్ని .. ఇది మహేశ్ బాబుకు 24వ సినిమా అనే విషయాన్ని ఈ పోస్టర్ ద్వారా మరోమారు స్పష్టం చేశారు.        

  • Loading...

More Telugu News