serial: సీరియ‌ల్ చూసి ఒంటికి నిప్పుపెట్టుకున్న ఏడేళ్ల బాలిక‌!

  • క‌ర్ణాట‌క‌లో దారుణం
  • ఆల‌స్యంగా వెలుగు చూసిన ఉదంతం
  • పిల్ల‌ల‌ను సీరియ‌ళ్లు చూడ‌నివ్వొద్ద‌ని కోరిన బాలిక త‌ల్లి

ఓ క‌న్న‌డ టీవీ సీరియ‌ల్ చూసి ఏడేళ్ల పాప త‌న‌కు తాను నిప్పుపెట్టుకుంది. శరీరం తీవ్రంగా కాలిపోవ‌డంతో ఆ పాప చ‌నిపోయింది. క‌ర్ణాట‌క‌లోని దావణగిరి జిల్లాలో హ‌రిహ‌ర ప‌ట్ట‌ణంలో ఈ దారుణం జ‌రిగింది. న‌వంబ‌ర్ 11న జ‌రిగిన ఈ సంఘ‌ట‌న, పాప త‌ల్లిదండ్రులు మంజునాథ్‌, చైత్ర‌లు పోలీసుల‌కు ఫిర్యాదు చేయ‌డంతో వెలుగుచూసింది.

వారి కుమార్తె ప్రార్థ‌న, టీవీలో ప్ర‌సార‌మ‌య్యే రెండు సీరియ‌ళ్ల‌ను చాలా ఇష్టంగా చూసేద‌ని, వాటిలో ఒక సీరియ‌ల్‌లో పాప‌కి ఇష్ట‌మైన పాత్ర మంట‌ల్లో డ్యాన్స్ చేయ‌డం చూసి ప్రార్థ‌న ప్ర‌భావిత‌మైంద‌ని, ఆ కార‌ణంగానే ఇంట్లో ఎవ‌రూ లేని స‌మ‌యంలో తాను కూడా ప్ర‌య‌త్నించి ప్రాణాలు పోగొట్టుకుంద‌ని ప్రార్థ‌న త‌ల్లి చైత్ర తెలిపింది.

 తాము ఎన్నిసార్లు వారించిన‌ప్ప‌టికీ చైత్ర సీరియ‌ళ్లు చూడ‌టం మాన‌లేద‌ని, ద‌య‌చేసి త‌ల్లిదండ్రులు పిల్ల‌ల్ని సీరియ‌ల్స్ చూడ‌నివ్వ‌కండ‌ని ఆమె కోరింది. ఈ ఘ‌ట‌న క‌ర్ణాట‌క‌లో చ‌ర్చ‌నీయాంశంగా మార‌డంతో క‌న్న‌డ టీవీ న‌టులు ప్రార్థ‌న కుటుంబానికి ప‌రామ‌ర్శ‌లు చేస్తున్నారు.

More Telugu News