sri lanka cricket: శ్రీలంక వన్డే, టీ20 టీమ్ కు కొత్త కెప్టెన్

  • కెప్టెన్ గా తిషారా పెరీరా నియామకం
  • తరంగ స్థానంలో తిషారా
  • భారత్ తో 3 వన్డేలు, 3 టీ20లు ఆడనున్న శ్రీలంక

భారత్-శ్రీలంకల మధ్య ప్రస్తుతం టెస్ట్ సిరీస్ కొనసాగుతోంది. ఈ సిరీస్ తర్వాత మూడు వన్డేలు, మూడు టీ20లను ఇరు జట్లు ఆడబోతున్నాయి. ఈ లిమిటెడ్ ఓవర్ల క్రికెట్ కు తిషారా పెరీరాను కెప్టెన్ గా నియమించారు. కెప్టెన్ బాధ్యతల నుంచి ఈ ఏడాది జులైలో మ్యాథ్యూస్ వైదొలగిన తర్వాత ఆయన స్థానంలో తరంగాను లిమిటెడ్ ఓవర్ టీమ్ కు కెప్టెన్ గా... చండిమల్ ను టెస్టు జట్టు కెప్టెన్ గా నియమించారు. అయితే ఈ ఏడాది భారత్, పాకిస్థాన్, దక్షిణఫ్రికాలతో జరిగిన సిరీస్ లో శ్రీలంక ఘోర ఓటమిని మూటగట్టుకుంది. ఈ నేపథ్యంలో లిమిటెడ్ ఓవర్ల జట్టుకు కెప్టెన్ గా పెరీరాను శ్రీలంక క్రికెట్ బోర్డు నియమించింది.

  • Loading...

More Telugu News