allu shirish: అల్లు శిరీష్ 'ఒక్క క్షణం' ఫస్టులుక్ రిలీజ్

  • వి.ఐ. ఆనంద్ దర్శకత్వంలో 'ఒక క్షణం'
  • అల్లు శిరీష్ చేస్తోన్న రొమాంటిక్ థ్రిల్లర్ 
  • ఆసక్తిని రేకెత్తిస్తోన్న ఫస్టులుక్ పోస్టర్
  • కథానాయికలుగా సురభి - శీరత్ కపూర్

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' టైటిల్ తోనే అందరిలో ఆసక్తిని రేకెత్తించిన దర్శకుడు వి.ఐ. ఆనంద్, ఆ తరువాత ఆ సినిమాతో ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు. తన తదుపరి సినిమా 'ఒక్క క్షణం'తోనూ అయన అదే స్థాయిలో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాడు. అల్లు శిరీష్ కథానాయకుడిగా తెరకెక్కుతోన్న ఈ సినిమా నుంచి కొంతసేపటి క్రితం ఫస్టులుక్ ను రిలీజ్ చేశారు.

కథానాయికకి అండగా నిలబడి, శత్రువుల దాడిని ధైర్యంగా ఎదుర్కొంటున్నవాడిగా ఈ పోస్టర్ లో అల్లు శిరీష్ కనిపిస్తున్నాడు. ఫస్టులుక్ తోనే అందరిలో కుతూహలాన్ని కలిగించడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. ఈ రొమాంటిక్ థ్రిల్లర్ లో సురభితో పాటు శీరత్ కపూర్ కూడా కథానాయికగా నటిస్తోంది. చక్రి చిగురుపాటి నిర్మిస్తోన్న ఈ సినిమాకి, మణిశర్మ సంగీతాన్ని సమకూర్చాడు. నిఖిల్ మాదిరిగానే అల్లు శిరీష్ కి కూడా వి.ఐ.ఆనంద్ హిట్ ఇస్తాడేమో చూడాలి మరి.        

More Telugu News