metro rail: మెట్రోరైల్ ప్రారంభం నేప‌థ్యంలో బొంతు రామ్మోహ‌న్‌కి అవమానం అంటూ వార్త‌లు.. ఖండించిన హైద‌రాబాద్ మేయ‌ర్‌!

  • మోదీ ఆవిష్క‌రించిన పైలాన్‌లో క‌నిపించ‌ని బొంతు రామ్మోహ‌న్ పేరు?
  • తీవ్ర మనస్తాపానికి లోనై ఆయ‌న‌ రాజీనామా చేశార‌ని వార్త‌లు
  • పోలీసుల‌కు ఫిర్యాదు చేసిన హైద‌రాబాద్ మేయ‌ర్‌

సోష‌ల్ మీడియాలో త‌నపై వ‌స్తోన్న వార్త‌ల ప‌ట్ల జీహెచ్‌ఎంసీ మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. మేయర్ త‌న ప‌ద‌వికి రాజీనామా చేశార‌ని వార్తలు వ‌స్తున్నాయి. మెట్రో రైల్ ప్రారంభోత్సవం సందర్భంగా రామ్మోహ‌న్‌కు అవమానం జరిగిందని, దీంతో తీవ్ర మనస్తాపానికి లోనై ఆయ‌న‌ రాజీనామా చేశార‌ని ఈ రోజు వార్త‌లు వ‌చ్చాయి.

దీంతో సోషల్ మీడియాల్లో త‌న‌పై తప్పుడు వార్తలు వస్తున్నాయని, వీటిని ప్ర‌చారం చేస్తోన్న వారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ సైబర్ నేర విభాగం అడిషనల్ డీసీపీ రఘువీర్ ను రామ్మోహన్ ఆశ్ర‌యించారు. ఈ రోజు ప్రధాని మోదీ చేతుల మీదుగా ఆవిష్క‌రించ‌బ‌డ్డ మెట్రోరైల్ పైలాన్‌లో రామ్మోహ‌న్ పేరు లేద‌ని, ఆయ‌న బీసీకి చెందిన వ్యక్తి కాబట్టే ఆయ‌న పేరు క‌నిపించ‌లేద‌ని కొంద‌రు వార్త‌లు ప్ర‌చారం చేస్తున్నారు.      

More Telugu News