Andhra Pradesh: ఏపీ ప్ర‌భుత్వానికి త‌గిన బుద్ధి ప్ర‌సాదించాల‌ని రేపు గంగ‌పూజ.. త‌ర‌లిరండి: ర‌ఘువీరారెడ్డి

  • హంద్రీనీవా కాలువ ప‌నుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేయాలి
  • ఏపీ ప్ర‌భుత్వం నిర్ల‌క్ష్యం వ‌హిస్తోంది
  • రైతులు, ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున రేపు జీడిప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్‌కు రావాలి

అనంత‌పురం జిల్లాలోని జీడిప‌ల్లికి నీరు చేరి ఐదేళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా ఈ రోజు విజ‌య‌వాడ‌లోని ఏపీసీసీ కార్యాల‌యం నుంచి ఏపీసీసీ అధ్య‌క్షుడు ర‌ఘువీరారెడ్డి ఓ ప్ర‌క‌ట‌న చేశారు. ఈ ప్రాజెక్టుకు నీరు వ‌చ్చేలా హంద్రీనీవా కాలువ ప‌నుల‌ను యుద్ధ ప్రాతిప‌దిక‌న పూర్తి చేసేలా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ ప్ర‌భుత్వానికి త‌గిన బుద్ధి ప్ర‌సాదించాల‌ని రేపు జీడిప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్ లో గంగ‌పూజ నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వ‌చ్చేకే కృష్ణా జలాల‌ను జీడిప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్‌కు తీసుకురావాల్సి వ‌స్తుందేమోన‌ని ఎద్దేవా చేశారు. రైతులు, ప్ర‌జ‌లు పెద్ద ఎత్తున రేపు జీడిప‌ల్లి రిజ‌ర్వాయ‌ర్‌కు త‌ర‌లివ‌చ్చి కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని పిలుపునిచ్చారు.    

More Telugu News