manchi laxmi: తెలుసుకోవాల్సింది ఎంతో ఉందన్న విషయాన్ని ఇక్కడ తెలుసుకుంటాం!: హెచ్ఐసీసీలో మ‌ంచు ల‌క్ష్మి

  • ప్ర‌పంచ ఔత్సాహిక‌ పారిశ్రామిక వేత్త‌ల స‌ద‌స్సుకి మంచు ల‌క్ష్మి
  • చాలా సార్లు మ‌న‌కి అన్నీ తెలుస‌ని  అనుకుంటాం
  • కానీ, ఇటువంటి చోట మ‌నకు తెలియ‌ని విష‌యాల‌ను తెలుసుకుంటాం
  • అంద‌రూ త‌మ ఆలోచ‌న‌ల‌ని పంచుకుంటారు

ప్ర‌పంచ ఔత్సాహిక‌ పారిశ్రామిక వేత్త‌ల స‌ద‌స్సుకి న‌టి, ప్రొడ్యూస‌ర్ మంచు ల‌క్ష్మి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ... ఒక‌ తెలుగు మ‌హిళ‌గా ఇందులో పాల్గొన‌డం ప‌ట్ల చాలా ఆనందంగా ఉంద‌ని అన్నారు. చాలా సార్లు మ‌న‌కి అన్నీ తెలుస‌ని  అనుకుంటామ‌ని, ఇటువంటి చోటుకి వ‌చ్చిన‌ వారిని క‌లిసిన‌ప్పుడు మ‌నకు తెలియ‌ని ఎన్నో విష‌యాల‌ను తెలుసుకుంటామ‌ని తెలిపారు.

 లైఫ్ అంటే ఇంతే కాదు, ఎంతో తెలుసుకోవాల్సి ఉంద‌ని గ్ర‌హిస్తామ‌ని చెప్పుకొచ్చారు. ఇక్క‌డ చాలా మంది మ‌హిళా ప్ర‌తినిధులు క‌లిసి పారిశ్రామిక రంగం గురించి త‌మ‌ ఆలోచ‌న‌ల‌ను పంచుకుంటార‌ని అన్నారు. కాగా, స‌ద‌స్సుకు ఏపీ మంత్రి లోకేశ్ భార్య బ్రాహ్మ‌ణి, సినీ న‌టుడు రామ్ చ‌ర‌ణ్ భార్య ఉపాస‌న కూడా హాజ‌ర‌య్యారు.    

More Telugu News