Mehrin: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం!

  • తనకు టాలీవుడ్డే ఎక్కువంటున్న మెహ్రీన్
  • శర్వానంద్ సరసన కాజల్ అగర్వాల్ 
  • నితిన్ సినిమా మ్యూజిక్ గురించి తమన్  
  • తాప్సీ చేతిలో మరో పెద్ద బ్రాండ్

*  హిందీ సినిమాల కంటే తనకి తెలుగు సినిమాలే ఎక్కువని అంటోంది నేటి బిజీ హీరోయిన్ మెహ్రీన్. "ఇప్పుడు నేనేమీ హిందీ సినిమాలు చేయడం లేదు. తెలుగు సినిమాలే చేస్తున్నాను. ఇక్కడ చేస్తున్నందుకు గర్వంగా చెప్పుకుంటాను. ఇక్కడ సక్సెస్ అయ్యాక బాలీవుడ్ కి వెళ్లిపోవాలని కూడా లేదు. ఒక విధంగా చెప్పాలంటే, నాకు తెలుగు సినిమాలే ఎక్కువ. ఆ తర్వాతే బాలీవుడ్ సినిమాలు" అంటూ చెప్పుకొచ్చింది.
*  శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో రూపొందే చిత్రం షూటింగ్ నిన్న హైదరాబాదులో ప్రారంభమైన సంగతి విదితమే. ఇందులో నిత్యా మీనన్ హీరోయిన్ గా ఇప్పటికే ఎంపికైంది, ఇక ప్రధాన నాయికగా కాజల్ ను తీసుకున్నారు. వచ్చే నెల నుంచి రెగ్యులర్ షూటింగ్ జరుగుతుంది.
*  నితిన్ నటిస్తున్న 25వ చిత్రానికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇక దీనికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. తాజాగా తమన్ ఈ చిత్రం గురించి చెబుతూ, మ్యూజిక్కుకు సంబంధించి తన పని దాదాపు పూర్తయిందని పేర్కొన్నాడు. ఇందులో నితిన్ సరసన మేఘా ఆకాష్ నాయికగా నటిస్తోంది.
*  'జుడ్వా 2' సినిమా సక్సెస్ తో బాలీవుడ్ లో బిజీ అయిపోయిన కథానాయిక తాప్సీకి కమర్షియల్స్ కూడా బాగానే వస్తున్నాయి. ఇప్పటికే ఓ ఆయిల్ ఉత్పత్తికి బ్రాండ్ అంబాసడార్ గా వున్న తాప్సీ, తాజాగా 'విమెన్స్ హార్లిక్స్' ఉత్పత్తికి ప్రచారకర్తగా సంతకం చేసింది.   

More Telugu News