deepika padukone: షారుక్ ఖాన్ కార్య‌క్ర‌మంలో కంట‌త‌డి పెట్టుకున్న దీపికా ప‌దుకునే

  • ఆమె తల్లి రాసిన ఉత్త‌రాన్ని చ‌దివిన బాద్‌షా
  • లేఖ‌లోని మాట‌లు విని భావోద్వేగానికి గురైన దీపికా
  • 'ప‌ద్మావ‌తి' విమ‌ర్శ‌ల గురించి కూడా ప్ర‌స్తావ‌న‌

బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ వ్యాఖ్యాత‌గా కొత్త‌గా ప్రారంభ‌మైన 'బాతే విత్ ద బాద్‌షా' కార్య‌క్ర‌మానికి మొద‌టి అతిథిగా న‌టి దీపికా ప‌దుకునే హాజ‌రైంది. స‌ర‌దా స‌ర‌దా విష‌యాల‌తో పాటు కొన్ని ప్ర‌త్యేక హంగుల‌తో రూపొందించిన ఈ టాక్ షోలో దీపికా భావోద్వేగానికి గురైంది. త‌న త‌ల్లి ఉజ్జ‌లా ప‌దుకునే రాసిన లేఖ‌ను షారుక్ చ‌ద‌వ‌డ‌మే అందుకు కార‌ణం.

కూతురు మీద ఆమెకు ఉన్న ప్రేమ‌ను, దీపిక సాధించిన విజ‌యాలు, ఎదుర్కున్న అడ్డంకులు, వాటిని దాటిరావ‌డానికి దీపిక చేసిన కృషిని ఉజ్జ‌ల లేఖ‌లో ప్ర‌స్తావించింది. దీంతో ఆమె ఒక్క‌సారిగా కంట‌త‌డి పెట్టుకుంది. ఆ ఫొటోలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. అంతేకాకుండా ఈ కార్య‌క్ర‌మంలో ఆమె పద్మావ‌తి చిత్రం మీద వ‌స్తున్న విమ‌ర్శ‌ల గురించి కూడా మాట్లాడింది. విమ‌ర్శ‌లు త‌న‌కు కొత్త విష‌యాలు నేర్పిస్తాయ‌ని, దీంతో త‌న‌కు మాన‌సిక ప‌రిణ‌తి చెందినట్లుగా అనిపిస్తుంద‌ని దీపికా ప‌దుకునే అంది.

More Telugu News