gujarat: గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో స్వ‌తంత్రంగా బ‌రిలోకి దిగుతున్న దళిత నేత జిగ్నేశ్!

  • కాంగ్రెస్ వెలుప‌లి నుంచి మ‌ద్ద‌తిచ్చింద‌ని ప్ర‌క‌ట‌న‌
  • బ‌న‌స్కంత జిల్లా వ‌ద‌గ‌మ్ నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ
  • మేవాని డిమాండ్ల‌కు అంగీక‌రించిన కాంగ్రెస్‌

గుజ‌రాత్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో తాను స్వ‌తంత్రంగా పోటీ చేస్తున్న‌ట్లు ద‌ళిత నేత జిగ్నేశ్ మేవాని ప్ర‌క‌టించారు. అందుకు కాంగ్రెస్ వెలుప‌లి నుంచి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించింద‌ని చెప్పారు. బనస్కంత జిల్లాలోని వదగమ్‌ నియోజకవర్గం నుంచి స్వతంత్రంగా పోటీ చేస్తున్నట్లు మేవాని తెలిపారు. సిట్టింగ్‌ ఎమ్మెల్యే మనిభాయ్‌ వాఘేలాను ఈసారి పోటీ చేయొద్దని కాంగ్రెస్‌ చెప్పిందన్నారు. ఇందుకు వాఘేలా కూడా అంగీకరించినట్లు తెలిపారు.

ఇటీవ‌ల కాంగ్రెస్ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీని జిగ్నేశ్ మేవాని క‌లిసిన సంగ‌తి తెలిసిందే. అప్పుడే కాంగ్రెస్ త‌మ డిమాండ్ల‌ను అంగీక‌రించింద‌ని, తాను ఏ పార్టీలోనూ చేర‌డం లేద‌ని ప్ర‌క‌టించారు. అయితే.. ఓబీసీ నేత అల్పేశ్‌ కాంగ్రెస్‌లో చేర‌గా, పాటిదార్ నేత‌ హార్దిక్‌ పటేల్ కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తిస్తోన్న విష‌యం విదిత‌మే.

More Telugu News