sharwanand: శర్వానంద్ జోడీగా మూడోసారి నిత్యామీనన్

  • సుధీర్ వర్మ దర్శకత్వంలో శర్వానంద్ 
  • ఈ రోజునే మొదలైన షూటింగ్ 
  • కథానాయికగా నిత్యామీనన్ 
  • త్వరలోనే రెగ్యులర్ షూటింగ్

శర్వానంద్ .. నిత్యామీనన్ కథల ఎంపిక విషయంలో ఎంత జాగ్రత్తగా వుంటారనే విషయం తెలిసిందే. కథలో కొత్తదనానికి .. పాత్రలలో వైవిధ్యానికి ఇద్దరూ చాలా ప్రాముఖ్యతను ఇస్తారు. గతంలో ఈ ఇద్దరూ కలిసి .. 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' .. 'రాజాధి రాజా' సినిమాలు చేశారు. 'మళ్లీ మళ్లీ ఇది రాని రోజు' సినిమా ఈ జంటకి ఎంతో మంచి పేరు తెచ్చిపెట్టింది. ఈ సినిమాను ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేదంటే ఆడియన్స్ మనసులో ఈ ఇద్దరూ ఎంతటి బలమైన ముద్ర వేశారనేది అర్థం చేసుకోవచ్చు.

అలాంటి ఈ జంట మూడోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీ అవుతోంది. సుధీర్ వర్మ దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ వారు ఈ రోజున ఒక సినిమాను లాంచ్ చేశారు. శర్వానంద్ కథానాయకుడిగా నటిస్తోన్న ఈ సినిమాలో, కథానాయికగా నిత్యామీనన్ ను ఎంపిక చేసినట్టుగా సమాచారం. ఈ జోడీకి యూత్ లో మంచి క్రేజ్ వుంది గనుక, సగం మార్కులను ఈ సినిమా ఇక్కడే సంపాదించుకుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.             

  • Loading...

More Telugu News