Hyderabad: మెట్రో కార్డు పట్టు... సెల్ఫీ పెట్టు... హైదరాబాద్ లేటెస్ట్ ట్రెండ్!

  • మెట్రో ప్రయాణానికి స్మార్ట్ కార్డులు
  • రూ. 200తో స్మార్ట్ కార్డు
  • తొలి రోజే 2,200 కార్డుల విక్రయం
  • సోషల్ మీడియాలో మెట్రో సెల్ఫీల జోరు

భాగ్యనగరిలో ఇప్పుడు లేటెస్ట్ ట్రెండ్ ఏంటో తెలుసా? మెట్రో రైల్ ముందు ఎలాగైనా నిలబడి ఫొటో దిగి సోషల్ మీడియాలో పంచుకోవడం. ఇంకా ఆ అవకాశం రానివారు, నిన్నటి నుంచి ప్రారంభించిన మెట్రో స్మార్ట్ కార్డు కొనుగోలు చేసి, దాంతో సెల్ఫీ దిగి అప్ లోడ్ చేస్తున్నారు. ఇక మియాపూర్ వంటి స్టేషన్ల దగ్గర సైకిల్ స్టాండ్లు ప్రారంభం కాగా, వాటి వద్ద సెల్ఫీలు దిగి పోస్టు చేస్తున్నారు.

 ఇక మెట్రో రైలు ట్రయల్ రన్స్ జోరుగా సాగుతుండగా, వాటికి పక్కనే ఉన్న భవంతులపై నుంచి సెల్ఫీలు దిగుతున్న వారి సంఖ్య కూడా అధికంగానే ఉంది. కాగా, ఆదివారం నాడు స్మార్ట్ కార్డు విక్రయాలను ప్రారంభించగా, ఒక్క రోజులోనే 2,200 మంది ఈ కార్డులను కొనుగోలు చేశారు. కార్డు ధర రూ. 200 కాగా, దీనిని రూ. 2 వేల వరకూ రీచార్జ్ చేసుకుని మెట్రో రైలులో టికెట్ కొనుగోలు చేసే అవసరం లేకుండా ప్రయాణించవచ్చు. ఎక్కిన చోట, దిగిన చోట కార్డును స్వైప్ చేస్తే, ప్రయాణించిన దూరానికి ఎమౌంట్ కట్ అవుతుంది.

More Telugu News