roja: 88 కిలోమీటర్ల పాదయాత్రను చేపట్టిన రోజా.. రేపే ప్రారంభం!

  • నాలుగు రోజుల పాదయాత్రను చేపట్టిన రోజా
  • గాలేరు-నగరి ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా యాత్ర
  • నగరి నుంచి తిరుమల కొండ వరకు పాదయాత్ర

ఓ వైపు వైసీపీ అధినేత జగన్ పాదయాత్ర కొనసాగుతోంది. ప్రజా సంకల్ప యాత్రలో ప్రజలతో ఆయన మమేకమై తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో, వైసీపీ ఫైర్ బ్రాండ్ రోజా తాను సైతం అంటూ... మరో పాదయాత్రకు సిద్ధమయ్యారు. రేపటి నుంచి ఆమె పాదయాత్ర ప్రారంభం కానుంది.

గాలేరు-నగరి ప్రాజెక్టుపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆమె పాదయాత్రను చేపట్టనున్నారు. నగరి నుంచి తిరుమల కొండ వరకు 88 కిలోమీటర్ల మేర నాలుగు రోజుల పాటు రోజా పాదయాత్ర కొనసాగుతుంది. ఈ పాదయాత్రకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
.

More Telugu News