padayathra: పాదయాత్రల పేరుతో రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యాఖ్య‌లు: జ‌గ‌న్‌పై సోమిరెడ్డి ఫైర్

  • మా స‌ర్కారు రైతుల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తోంది
  • ఎన్ని ఆటంకాలు వ‌చ్చినా రైతు సంక్షేమాన్ని మ‌ర‌వ‌బోం
  • జగన్‌ తన పాదయాత్రలో వాస్తవాలను చెప్పాలి

ప్ర‌జాసంక‌ల్ప యాత్ర పేరుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగ‌న్మోహ‌న్ రెడ్డి చేస్తోన్న పాద‌యాత్ర‌పై ఆంధ్ర‌ప్ర‌దేశ్ మంత్రి సోమిరెడ్డి చంద్ర‌మోహ‌న్ రెడ్డి మండిప‌డ్డారు. ఈ రోజు రాజమహేంద్రవరంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... కొందరు రాజకీయ పార్టీల నాయకులు పాదయాత్రల పేరుతో రైతుల ఆత్మస్థైర్యం దెబ్బతినేలా వ్యాఖ్య‌లు చేస్తున్నార‌ని అన్నారు. తమ స‌ర్కారు రైతుల సమస్యలు తీర్చేందుకు కృషి చేస్తోందని చెప్పారు. త‌మ‌కు ఎన్ని ఆటంకాలు  వ‌చ్చినా రైతు సంక్షేమాన్ని మాత్రం మ‌ర‌వ‌బోమ‌ని తెలిపారు. జగన్‌ తన పాదయాత్రలో వాస్తవాలను చెప్పాలని చంద్ర‌మోహ‌న్ రెడ్డి వ్యాఖ్యానించారు.

More Telugu News