dawood ibrahimn: ఏకైక కుమారుడు మత పెద్దగా మారుతానని చెప్పడంతో తీవ్ర డిప్రెషన్ లో కూరుకుపోయిన దావూద్ ఇబ్రహీం!

  • మసీదులో సేవలందించాలని నిర్ణయించుకున్న మోయిన్
  • తండ్రి కార్యకలాపాలాలను ఆది నుంచి వ్యతిరేకించిన మోయిన్
  • కుటుంబానికున్న చెడ్డ పేరు పోగొట్టాలని భావిస్తున్నాడంటున్న ముంబై పోలీసులు

ముంబై బాంబు పేలుళ్ల కేసు ప్రధాన నిందితుడు, ప్రస్తుతం పాక్ లో తలదాచుకుంటున్న దావూద్ ఇబ్రహీం ప్రస్తుతం తీవ్ర డిప్రెషన్ లో కూరుకుపోయాడట. తన వ్యాపార సామ్రాజ్యానికి వారసుడిగా మారతాడని భావించిన కుమారుడు, మసీదులో కూర్చుని మత పెద్దగా మారి మౌలానాగా సేవలందించాలని నిర్ణయించుకోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది.

కుటుంబ వ్యాపారాలను వద్దనుకుంటున్న దావూద్ కుమారుడు మోయిన్ నవాజ్ డీ కస్కర్ (31), మత పెద్దగా మారాలని నిర్ణయించుకుని తండ్రికి కొత్త టెన్షన్స్ తెచ్చి పెట్టాడని ముంబై పోలీసులు వెల్లడించారు. తండ్రి చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఆది నుంచి వ్యతిరేకిస్తున్న మోయిన్, ప్రపంచవ్యాప్తంగా తన కుటుంబానికి ఉన్న చెడ్డ పేరును పోగొట్టాలని భావిస్తున్నాడని థానే యాంటీ ఎక్స్ టార్షన్ సెల్ చీఫ్ ప్రదీప్ శర్మ వెల్లడించారు. మోయిన్ నిర్ణయం దావూద్ కుటుంబంలో పెను కలకలం రేపిందని ఆయన అన్నారు. తమకు పట్టుబడిన ఇక్బాల్ ఇబ్రహీం కస్కర్ ను ఇంకా విచారిస్తున్నామని తెలిపారు.

More Telugu News