Kodandaram: 'కొలువుల‌కై కొట్లాట‌'కు త‌ర‌లిరండి: ప్రొ.కోదండ‌రామ్

  • హైద‌రాబాద్‌లోని స‌రూర్‌న‌గ‌ర్ మైదానంలో కొలువుల‌కై కొట్లాట‌ స‌భ
  • వ‌చ్చేనెల 4 లేక 5వ తేదీలో నిర్వ‌హ‌ణ‌
  • ఉద్యోగాలు లేక యువ‌త క‌ష్టాలు
  • త‌ర‌లిరండి-ప్రొ.కోదండ‌రామ్‌

తెలంగాణ వ‌చ్చి మూడున్న‌రేళ్లు పూర్త‌యిన‌ప్ప‌టికీ ఉద్యోగాల భ‌ర్తీ చేయ‌లేద‌ని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తోన్న టీజేఏసీ 'కొలువుల‌కై కొట్లాట' పేరుతో భారీ బ‌హిరంగ స‌భ‌ను నిర్వ‌హించ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఈ రోజు న‌ల్గొండ‌లో ప్రొ.కోదండ‌రామ్ ఆధ్వ‌ర్యంలో 'కొలువుల‌కై కొట్లాట' స‌న్నాహ‌క స‌ద‌స్సును నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా టీజేఏసీ ఛైర్మ‌న్ ప్రొ.కోదండ‌రామ్ మీడియాతో మాట్లాడుతూ ప‌లు వివ‌రాలు తెలిపారు. వ‌చ్చేనెల 4 లేక 5వ తేదీలో హైద‌రాబాద్‌లోని స‌రూర్‌న‌గ‌ర్ మైదానంలో కొలువుల‌కై కొట్లాట‌ స‌భను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు.

ఈ స‌భ మ‌ధ్యాహ్నం 2 గంటల నుంచి ప్రారంభిస్తామ‌ని ప్రొ.కోదండ‌రామ్ చెప్పారు. చ‌దువుకున్న యువ‌త‌లో 80 శాతం మంది చిన్న చిన్న ఉద్యోగాల్లో, దిన‌స‌రి కూలీలుగా ఉన్నారని, ఇది దుర‌దృష్ట‌క‌ర‌మ‌ని అన్నారు. ఒక ప్రణాళిక బ‌ద్ధంగా ఉద్యోగాల ప్ర‌క‌ట‌న‌లు చేయాలని డిమాండ్ చేశారు. ఈ స‌భ‌లో పాల్గొని విజ‌య‌వంతం చేయాల‌ని యువ‌త‌కు పిలుపునిచ్చారు.    

More Telugu News