mahesh kathi: ప్ర‌జా ప్ర‌తినిధిగా ఎమ్మెల్యే రోజా ఎంత దిగ‌జారి ఉందో ఆ న‌వ్వు చూస్తుంటేనే తెలుస్తోంది: మ‌హేశ్ క‌త్తి

  • కామెడీషో జ‌బ‌ర్ద‌స్త్‌పై ర‌గ‌డ
  • జ‌బ‌ర్ద‌స్త్ వ‌ల్ల ఎమ్మెల్యే అయ్యాన‌ని రోజా అన్నారు 
  • ఈ వ్యాఖ్య‌ ఎంత దారుణం
  • అనాథ‌ల‌పై వికృత వ్యాఖ్య‌లు చేస్తోంటే రోజా గ‌ట్టిగా న‌వ్వుతూ ఎంజాయ్ చేస్తున్నారు

కామెడీషో 'జ‌బ‌ర్ద‌స్త్‌'పై ర‌గ‌డ రాజుకుంది. త‌మ‌ను హేళ‌న చేస్తూ, కించప‌రుస్తూ న‌టుడు హైప‌ర్ ఆది డైలాగులు ప‌లికాడంటూ ఈ రోజు అనాథ బాలిక‌లు పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసిన విష‌యం తెలిసిందే. ఈ విష‌యంపై ప్ర‌ముఖ న్యూస్ ఛానెల్ టీవీ9 నిర్వ‌హించిన ఇంట‌ర్వ్యూలో సినీ విశ్లేష‌కుడు మ‌హేశ్ క‌త్తి మాట్లాడుతూ జ‌బ‌ర్ద‌స్త్ న‌టులు, జ‌డ్జిల తీరుపై ఆగ్రహం వ్య‌క్తం చేశారు. ఈ షోలో న‌టించే న‌టులే కాకుండా జ‌డ్జి, ఎమ్మెల్యే రోజా కూడా దారుణంగా మాట్లాడుతున్నార‌ని అన్నారు.

కొన్ని రోజుల క్రితం వైసీపీ ఎమ్మెల్యే రోజా మాట్లాడుతూ తాను 'జ‌బ‌ర్ద‌స్త్' వ‌ల్లే ఎమ్మెల్యేని అయ్యాన‌ని చెప్పుకున్నార‌ని మ‌హేశ్ క‌త్తి తెలిపారు. ఓ ప్ర‌జా ప్ర‌తినిధి ఇలా మాట్లాడ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. ఓటు వేసిన న‌గ‌రి ప్ర‌జ‌లు ఏమ‌య్యార‌ని, సీటు ఇచ్చిన పార్టీ ఏమ‌యింద‌ని, ఏవీ కాకుండా 'జ‌బ‌ర్ద‌స్త్' షో వ‌ల్ల ఎమ్మెల్యేని అయ్యాన‌ని చెప్పుకుంటున్నార‌ని అన్నారు. రోజా ఇలా ఎలా మాట్లాడుతుందో తన‌కు అర్థం కావ‌డం లేద‌ని విమ‌ర్శించారు.

హైప‌ర్ ఆదిలాంటి వారు ఇలా అనాధ‌ల‌పై వికృత వ్యాఖ్య‌లు చేస్తోంటే ఖండించాల్సింది పోయి, బిగ్గ‌ర‌గా న‌వ్వుతూ రోజా ఎంజాయ్ చేస్తున్నార‌ని ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్ర‌జా ప్ర‌తినిధిగా రోజా ఎంత దిగ‌జారి ఉందో ఆ న‌వ్వు చూస్తుంటేనే తెలుస్తోందని వ్యాఖ్యానించారు. ఈ షోలో వేసే వికృత డైలాగుల‌కు జ‌డ్జిలు ఇలా వెట‌కారంగా న‌వ్వుతోంటే ఎలా స్పందించాలో కూడా త‌న‌కు అర్థం కావ‌డం లేద‌ని అన్నారు.

More Telugu News