bride: భ‌ర్త‌ను కూల్ డ్రింక్ కోసం బ‌య‌ట‌కు పంపి.. న‌గ‌ల‌తో పారిపోయిన కొత్త పెళ్లికూతురు!

  • అజ‌య్ అనే యువ‌కుడికి ఓ యువ‌తిని ప‌రిచ‌యం చేసిన మ‌హిళ‌
  • పెద్ద‌ల‌తో మాట్లాడి పెళ్లి చేసిన వైనం
  • పెళ్ల‌యిన రెండు రోజుల‌కి జంప్
  • పోలీసుల‌కు ఫిర్యాదు

ఓ యువ‌కుడిని పెళ్లి చేసుకుని రెండు రోజుల త‌రువాత‌ ఓ యువ‌తి న‌గ‌ల‌తో పారిపోయిన ఘ‌ట‌న ఉత్తరాఖండ్‌లోని రూర్కీ జిల్లా కువాన్‌ హెది గ్రామంలో చోటు చేసుకుంది. అజ‌య్ అనే యువ‌కుడికి ఓ మ‌హిళ ఓ అమ్మాయిని ప‌రిచ‌యం చేసింది. అజ‌య్ కుటుంబాన్ని ఒప్పించి ఆ యువ‌తితో ఈ నెల 22న‌ పెళ్లి జ‌రిపించింది. రెండురోజులు కాపురం చేసిన ఆ యువ‌తి.. నిన్న తనకు జ్వ‌రం వ‌చ్చింద‌ని చెప్పింది.

అజయ్ ఆమెను వైద్యుడి వ‌ద్ద‌కు తీసుకెళ్లాడు. ఆసుప‌త్రి నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చాక‌ ఆ యువ‌తి త‌న‌కు చికెన్ తినాల‌నిపిస్తోంద‌ని త‌న భ‌ర్త‌తో చెప్పింది. దీంతో ఆమెకు బిర్యాని తినిపించ‌డానికి అజ‌య్.. పుర్కాజీ పట్టణానికి తీసుకెళ్లాడు. చికెన్‌ బిర్యాని తిన్న తర్వాత కూల్‌ డ్రింక్‌ కావాలని కోరింది. భ‌ర్త కూల్ డ్రింక్ కోసం ప‌క్క‌కు వెళ్ల‌డంతో ఆమె అక్క‌డి నుంచి పారిపోయింది. ఎంత వెతికినా ఆమె క‌న‌ప‌డ‌క‌పోవ‌డంతో అజ‌య్‌ ఇంటికి వ‌చ్చేశాడు.

అప్పుడే ఆయ‌న‌కు షాకింగ్ నిజం తెలిసింది. ఆమెకు బహుమతిగా అజయ్‌ కుటుంబసభ్యులు పెట్టిన బంగారు, వెండి నగలు కూడా క‌న‌ప‌డ‌డం లేవ‌ని ఆయ‌న‌కు తెలిసింది. ఆ యువ‌తి చేసిన మోసాన్ని గుర్తించిన కుటుంబ స‌భ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ యువ‌తిని త‌మ‌కు ప‌రిచ‌యం చేసిన మ‌రో మ‌హిళ కూడా జంప్ అయింద‌ని తెలుసుకున్నారు. ఈ ఘ‌ట‌న‌పై పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్నారు. 

More Telugu News