nagachaithanya: చైతూ హీరోగా మారుతి దర్శకత్వంలో మొదలైన 'శైలజా రెడ్డి అల్లుడు'

  • మారుతి దర్శకత్వంలో 'శైలజా రెడ్డి అల్లుడు' 
  • కథానాయకుడిగా నాగచైతన్య 
  • నాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ ఎంపిక 
  • ఈ రోజునే పూజా కార్యక్రమాలు    

ప్రస్తుతం నాగచైతన్య .. చందూ మొండేటి దర్శకత్వంలో 'సవ్యసాచి' సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లి కొన్ని రోజులే అవుతుండగా, మారుతి దర్శకత్వంలో ఆయన మరో సినిమాను లాంచ్ చేశాడు. కొంతసేపటి క్రితం ఈ సినిమా హైదరాబాద్ - రామానాయుడు స్టూడియోలో పూజా కార్యక్రమాలు జరుపుకుంది. ఈ సినిమాలో కథానాయికగా అనూ ఇమ్మాన్యుయేల్ ను ఎంపిక చేసుకున్నారు. కథ ప్రకారం 'శైలజా రెడ్డి అల్లుడు' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు.

 కథానాయకుడి అత్త పాత్ర పవర్ ఫుల్ గా వుండనుండటంతో, ఈ పాత్ర కోసం రమ్యకృష్ణను తీసుకోనున్నట్టు వార్తలు వస్తున్నాయి. యూత్ ను .. మాస్ ను .. ఫ్యామిలీ ఆడియన్స్ ను దృష్టిలో పెట్టుకుని మారుతి ఈ కథను సిద్ధం చేశాడు. అందువలన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందని ఆయన భావిస్తున్నాడు. ఈ సినిమాతో అనూ ఇమ్మాన్యుయేల్ మరో ఛాన్స్ దక్కించుకోవడం విశేషం.    

More Telugu News