suicide: బావిలో దూకి న‌లుగురు విద్యార్థినుల ఆత్మ‌హ‌త్య

  • త‌మిళ‌నాడు వేలూరు జిల్లా అర‌క్కోణం స‌మీపంలో విషాద ఘటన 
  • స్థానిక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 11వ త‌ర‌గ‌తి చ‌దువుతోన్న బాలిక‌లు
  • ఉపాధ్యాయులు మంద‌లించ‌డం వ‌ల్లే బ‌లవ‌న్మ‌ర‌ణం?

త‌మిళ‌నాడు వేలూరు జిల్లా అర‌క్కోణం స‌మీపంలో విషాద ఘ‌ట‌న చోటు చేసుకుంది. త‌మ పాఠ‌శాల‌కు ద‌గ్గ‌ర‌లో ఉన్న‌ వ్య‌వ‌సాయ బావిలో దూకి న‌లుగురు బాలిక‌లు ఆత్మ‌హ‌త్య చేసుకున్నారు. స్థానిక ప్ర‌భుత్వ పాఠ‌శాల‌లో 11వ త‌ర‌గ‌తి చ‌దువుతోన్న విద్యార్థినులు ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డ‌డం క‌ల‌క‌లం రేపుతోంది. ఉపాధ్యాయులు మంద‌లించ‌డం వ‌ల్లే వారు బ‌లవ‌న్మ‌రణానికి పాల్ప‌డిన‌ట్లు తెలుస్తోంది. ఈ ఘ‌ట‌న‌పై స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌నా స్థ‌లికి చేరుకుని ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు. ఆ బాలికలు ఆత్మ‌హ‌త్య చేసుకోవ‌డానికి గ‌ల కార‌ణాల‌పై ఆరా తీస్తున్నారు.      

More Telugu News