extramarital affair: భర్తను 8 ముక్కలుగా నరికిన మహిళ, ఆమె ప్రియుడికి కఠిన శిక్షను విధించిన కోర్టు

  • అక్రమ సంబంధంతో భర్త హత్య
  • శరీరం ముక్కలను ఇంట్లోనే దాచిన భార్య, ప్రియుడు
  • 30 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించిన కోర్టు

సొంత భర్తను అత్యంత పాశవికంగా హత్య చేసి, 8 ముక్కలుగా నరికిన మహిళకు 30 ఏళ్ల కఠిన కారాగార శిక్షను విధించింది హర్యాణాలోని జజ్జర్ జిల్లా కోర్టు. కేసు వివరాల్లోకి వెళ్తే, పూజ (30), బల్జీత్ సింగ్ లు భార్యాభర్తలు. బల్జీత్ కనిపించడం లేదంటూ 2016 ఏప్రిల్ 26న అతని సోదరుడు కుల్జీత్ సింగ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అదే సమయంలో అతని ఇంటి నుంచి చెడు వాసన వస్తున్నట్టు బల్జీత్ ఇద్దరు సోదరిలు గుర్తించారు. దీంతో, తమ అన్న అదృశ్యం వెనుక పూజ హస్తం ఉందని వారు అనుమానించారు. వీరి ఫిర్యాదుతో పూజ పేరును ఎఫ్ఐఆర్ లో పోలీసులు ఎక్కించారు. అనంతరం విచారణలో పూజ ఇచ్చిన సమాధానాలతో పోలీసులు సంతృప్తి చెందలేకపోయారు. ఆమె సమాధానాలు పొంతన లేకుండా ఉన్నాయని వారు గుర్తించారు.

ఈ క్రమంలో ఓ వైపు పోలీసు విచారణ జరుగుతుండగానే, మరో వైపు కుటుంబసభ్యులు తమ వంతుగా ఆమె ఇంట్లో వెతికారు. దాంతో తమ సోదరుడు హత్యకు గురయ్యాడనే నిజాన్ని వారు గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని పోలీసులకు తెలిపారు. ఆ తర్వాత పూజను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పోలీసుల విచారణలో నిజాలు వెలుగు చూశాయి. తమ పొరుగునే నివసించే ఓ వ్యక్తితో తనకు శారీరక సంబంధం ఉందని... ఈ నేపథ్యంలోనే, ఇద్దరం కలసి బల్జీత్ ను చంపేశామని ఒప్పుకున్నారు.

ఆ తర్వాత కోర్టు విచారణలో ఇరువైపు వాదనలు విన్న జడ్జి... పూజ, ఆమె ప్రియుడు ఇద్దరూ కలిసి పక్కా ప్రణాళికతోనే హత్య చేశారని రుజువైందని చెప్పారు. వీరిద్దరికీ 30 సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధిస్తున్నట్టు తీర్పును వెలువరించారు.

2016 ఏప్రిల్ లో బల్జీత్ శరీరాన్ని 8 ముక్కలుగా నరికి ఇంట్లోని వివిధ ప్రదేశాల్లో ఆ భాగాలను ఉంచారు.

More Telugu News